Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘సలార్’ నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఎపిసోడ్ను ట్రిమ్ చేస్తున్న ప్రశాంత్ నీల్
పాన్ ఇండియా హీరోగా పేరొందిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏక కాలంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పలు చిత్రాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, అనివార్య కారణాల వల్ల రెండో షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'సలార్'. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఇండో - పాక్ వార్ నేపథ్యంతో రాబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో సెకెండాఫ్లో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ హైలైట్గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమచారం ప్రకారం.. ఈ సినిమా ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ను ప్రశాంత్ నీల్ ట్రిమ్ చేస్తున్నాడట. అనుకున్న స్క్రిప్ట్ మొత్తంలో తగ్గించడానికి ఎక్కడా అవకాశం లేకపోవడం వల్లే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ను తగ్గించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
హాట్ ఫొటోలతో యాంకర్ విష్ణుప్రియ రచ్చ: ఎద అందాలు కనిపించేలా రెచ్చిపోయిన బ్యూటీ
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడట. సెకెండాఫ్లో వార్ ఎపిసోడ్ను హైలైట్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తవగా.. రెండోది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.