Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రాశీ ఖన్నాను అలా చూసి అమెరికా నుంచి ఇండియాకు.. 'ప్రతిరోజు పండగే కథ' లీక్..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్లో రాబోతోన్న ప్రతి రోజు పండగే చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. చిత్రలహరితో ఫ్లాపుల్లోంచి సక్సెస్ బాట పట్టిన మెగా హీరో.. వరుస ఫ్లాపులతో కసి మీదున్న మారుతి కలిసి రాబోతోండటంతో కథ, కథనంపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు.
ఓ బావా అంటూ ప్రోమో..
ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలు చాలా కూల్గా ఉండటంతో అందరికీ ఆసక్తి ఏర్పడింది. తమన్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. అంతకుముందే ఈ సాంగ్ టీజర్ను విడుదల చేయగా.. తాజాగా ఓ బావా అంటూ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు.
ఆకట్టుకున్న లిరికల్ వీడియో..
ఫ్యామిలీ అంతా కలిసి పాడుకునే పాటలా, అక్క, బావలను ఏడిపిస్తూ ఉన్న చెల్లెళ్లు ఇలా ప్రతీది పాటలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్క బెట్టు చేస్తుండటంతో.. బావకు సపోర్ట్ చేయడం, అతని గొప్పలు చెప్పడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన కథ కాస్తా లీకైంది.
|
టిక్టాక్ పిచ్చిలో హీరోయిన్..
ఈ మూవీలో రాశీ ఖన్నా టిక్ టాక్ పిచ్చిలో మునిగిపోతుందని ఇంతకుముందే లీకైంది. ఈ పాత్రలో రాశీ అందర్నీ నవ్విస్తుందని సమాచారం. ప్రస్తుతం టిక్ టాక్ ట్రెండ్ నడుస్తుందని అందరికీ తెలిసిందే. అందుకు మారుతి ఈ పాయింట్ను పట్టుకుని థియేటర్లో నవ్వులు పూయించేలా స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది.
అలా చూసి అక్కడి నుంచి ఇండియాకు..
టిక్ టాక్లో రాశీ ఖన్నా చేసే వీడియోలను చూసిన హీరో.. అమెరికాను వదిలేసి ఆమెను కలుసుకునేందుకు ఇండియాకు వచ్చాడని పాటను వింటే అర్థమవుతోంది. మరి ఇదే మెయిన్ పాయింట్ అయి ఉంటుందా? లేదా ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందా? అన్నది చూడాలి.
Recommended Video
వచ్చే నెలలో..
గతంలో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా సుప్రీం సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది.