Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ప్రతిరోజూ పండగే ట్రైలర్: తాతకు గురిపెట్టిన సాయి ధరమ్ తేజ్..
అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్పై రూపొందుతోన్న సినిమా 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన రాశి ఖన్నా ఆడిపాడుతోంది. థమన్ బాణీలు కడుతున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇప్పటికే పలు అప్డేట్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ప్రతిరోజూ పండగే' ట్రైలర్ ద్వారా సినిమాపై హైప్ పెంచేశారు. యూత్ మొదలుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. 2 నిమిషాల 18 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఈ ట్రైలర్లో తాతామనవాళ్లు సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్ లపై షూట్ చేసిన సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ రాశి ఖన్నాతో మెగా మేనల్లుడి రొమాంటిక్ సీన్స్ చూసి యూత్ పులకరించిపోతున్నారు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా ప్రమోషన్స్ మేజర్ అసెట్ అయిందని చెప్పుకోవచ్చు.
ఇప్పటి వరకు రిలీజైన అన్ని అప్డేట్స్కి వచ్చిన ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందని ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. డిసెంబర్ 20వ తేదీన 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల కానుంది. ఆ రోజు నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులకు ప్రతిరోజూ పండగే అవుతుందని అంటున్నారు మేకర్స్.