Don't Miss!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
TNR ఫ్యామిలీకి అండగా ప్రముఖ నిర్మాణ సంస్థ: ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఎమోషనల్ పోస్ట్
చాలా కాలంగా జర్నలిజం రంగంలో విశేషమైన సేవలు అందించడంతో పాటు ఎంతో మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసి.. ఈ మధ్య కాలంలో నటుడిగా బిజీ అయిపోయిన టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన ఆయన.. అప్పటి నుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్సను తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సీనియర్ జర్నలిస్టు కమ్ ఆర్టిస్టు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. దీంతో సోమవారం ఉదయం వరకూ మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.
టీఎన్నార్ (తుమ్మల నరసింహారెడ్డి) మరణంపై సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక, మంగళవారం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ప్రకటించారు. వీళ్లిద్దరే కాదు.. టాలీవుడ్కు చెందిన చాలా మంది ప్రముఖులు ఆయన ఫ్యామిలీకి అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కూడా ఆర్థిక సహాయం ప్రకటించింది.
టాలీవుడ్లో పలు చిత్రాలు నిర్మించి మంచి పేరు సంపాదించుకున్న నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్.. తాజాగా టీఎన్నార్ కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో 'ప్రముఖు ఫిల్మ్ జర్నలిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్టు టీఎన్నార్ గారి మరణం విచారకరం. మేము ఆయన కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించాం. ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ సానుభూతిని తెలుపుతున్నాం. ఓం శాంతి' అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ సంస్థపై చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.