కరోనాకు బయడపడేదే లేదు.. కమెడియన్ డేరింగ్ స్టెప్!
కరోనా దెబ్బకు ప్రపంచమే వణికిపోతోంది. దేశాలు దాటి ఖండాలు దాటి మారుమూల ప్రాంతాల్లోకి ఆ వైరస్ పాకుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలోనూ కరోనా లక్షణాలు బయటపడగా.. కొందరు ప్రాణాలు కూడా విడిచారు. అయితే మన కమెడియన్ మాత్రం చాలా కూల్గా వీధుల వెంట తిరిగేస్తున్నాడు. అది కూడా మన దేశంలో కాదు.. విదేశాల్లో. ఇంతకీ ఆయన కథ ఏంటి? ఎక్కడ ఉన్నాడు?అక్కడికి ఎందుకు వెళ్లాడు? అనే విషయాలు ఓ సారి చూద్దాం.
ప్రభాస్-రాధాకృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ డియర్, రాధేశ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి అడుగడునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్స్ జరగక షెడ్యూల్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా కరోనా ఎఫెక్ట్కు యూరప్ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అవుతుందని అంతా భావించారు.

అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ సారి వెనకడుగు వేయలేదు. ప్రభాస్, పూజా హెగ్డేల మీద తెరకెక్కించాల్సిన సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూరప్కు వెళ్లింది. రెండ్రోజుల క్రితం మాస్క్తో ఉన్న పూజా తన పిక్స్ను షేర్ చేసింది. తాజాగా ప్రియదర్శి కూడా విదేశాలకు వెళ్లాడు. అక్కడ వీధుల్లో తిరుగుతూ.. కరోనాను ఎదురించండి.. నిర్మానుష్యంగా ఉన్న ఎయిర్ పోర్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్లాను.. అద్భుతమైనజార్జియాను చేరుకున్నాను.. ప్రభాస్ 20లో జాయిన్ అయ్యాను.


Click it and Unblock the Notifications











