Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బోల్డ్గా పిచ్చెక్కిస్తున్న ప్రియాంక.. లండన్నే హీటెక్కించే పోజ్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందాల గురించి వర్ణించాల్సిన పనే లేదు. నటనతో పాటు అందాన్ని కూడా అందరి ముందుంచి హాట్ హీరోయిన్గా వరల్డ్ క్రేజ్ తెచ్చుకుంది ప్రియాంక. ఇటీవలే తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ని ప్రేమ వివాహం చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత మరింత గ్లామర్ పెంచేసింది. దేశ, విదేశాల్లో ఏ వేడుక జరిగినా ప్రియాంక అందాలకే కెమెరాలు దాసోహం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది గమనించిన లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియం మేనేజ్మెంట్, ఆమె అందానికున్న క్రేజ్ క్యాచ్ చేసుకునేలా మైనపు బొమ్మ రూపొందించింది. ఈ బొమ్మలో ప్రియాంక అందాలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. తాజాగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2017 లో ధరించిన గోల్డెన్ సెక్విన్ డ్రస్ లో ప్రియాంక బొమ్మను రూపొందించారు. ఈ మైనపు బొమ్మను చూస్తే నిజమైన అందాల భామ లాగే కనిపిస్తోంది. పొరపాటున కూడా దీనిని చూసి బొమ్మ అనుకోరు.. అంత సజీవంగా కనిపిస్తోంది. పైగా లండన్నే హీటెక్కించేలా ఆ హాట్ పోజు మత్తెక్కిస్తోంది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా తన సత్తా చాటి హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంక చోప్రా నిక్ జోనాస్తో వివాహం తర్వాత సినిమాలు బాగా తగ్గించింది. ప్రస్తుతం 'ది స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలో పాటు హృతిక్ రోషన్ చిత్రం 'క్రిష్ 4' చిత్రంలో నటిస్తోంది. కాగా ప్రియాంకకు లండన్ టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.
లండన్ టుస్సాడ్స్ మ్యూజియంకి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ఈ మ్యూజియంలో చోటు సాధించడమేమీ ఆషామాషీ విషయం కాదు. భారీ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలకే అందులో స్థానం దక్కుతుంది. ఇప్పటికే భారత దేశానికి చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఘనతను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, దీపక పదుకొనే, కత్రినా కైఫ్ ఆ ఘనత సొంతం చేసుకోగా టాలీవుడ్ నుంచి ఇటీవలే మహేష్ బాబుకు ఈ మ్యూజియంలో స్థానం లభించింది.