Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Most Eligible Bachelor OTT: అఖిల్ మూవీ స్ట్రీమింగ్పై క్లారిటీ.. షాకింగ్ న్యూస్ చెప్పిన నిర్మాత
చిన్న వయసులోనే 'సిసింద్రీ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేశాడు అక్కినేని వారసుడు అఖిల్. సుదీర్ఘ విరామం తర్వాత అతడు 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీని తర్వాత అతడు 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాల్లోనూ నటించాడు. కానీ, ఇవి కూడా ఈ యంగ్ హీరోకు సక్సెస్ను మాత్రం అందించలేకపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!
‘బ్యాచ్లర్'గా వచ్చేసిన హీరో అఖిల్
బొమ్మరిల్లు భాస్కర్ - అక్కినేని అఖిల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!
బిజినెస్ కూడా భారీగా.. మొత్తం ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
అంచనాలు భారీగా.. టాక్ కూడా ఇలా
రొమాంటిక్ జోనర్లో అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది.
నయనతార హాట్ ఫొటోను షేర్ చేసిన విఘ్నేష్: ఆమెను అలా చూస్తే తట్టుకోవడం కష్టమే
రెండు రోజుల్లోనే అన్ని కోట్లు వసూలు
అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఇక, రెండో రోజైన శనివారం కూడా ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయింది. దీంతో రెండు రోజుల్లోనే దీనికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 13 కోట్లు వసూలయ్యాయి. మరో ఆరు కోట్లు వస్తే హిట్ స్టేటస్ వచ్చేస్తుంది.
‘బ్యాచ్లర్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్పై
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎప్పుడు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నవంబర్ 12 నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో అందరిలో అయోమయం నెలకొంది.
జబర్ధస్త్ సెట్లో బాలకృష్ణకు రోజా ఫోన్: ఊహించని మాటలతో షాకిచ్చిన నటసింహం.. సంచలనంగా ఆడియో క్లిప్
Recommended Video
షాకింగ్ న్యూస్ చెప్పిన మూవీ నిర్మాత
విజయవంతంగా రన్ అవుతోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ప్రచారం మొదలైన నేపథ్యంతో నిర్మాతల్లో ఒకరైన వాసు తాజాగా స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్కు రిప్లై ఇస్తూ 'ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మూవీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం అవుతుంది' అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఓటీటీ వార్తలకు ఇలా ఫుల్స్టాప్ పెట్టేశారు.