Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డ్రగ్ కేసులో టాలీవుడ్ నిర్మాత విచారణ పూర్తి.. 7 గంటలపాటు ఏకధాటిగా ప్రశ్నల వర్షం
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఎన్సీబీ అధికారులు నిర్మాత మధు మంతెనను బుధవారం సుధీర్ఘంగా విచారించారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జయ సాహాతోపాటు మధు మంతెనను కలిపి ఎదురెదురుగా విచారించినట్టు తెలిసింది. వీరిద్దరూ కూడా క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో అనుబంధం ఉన్నావారే కావడంతో పలు కోణాల్లో విచారణ చేపట్టారు. క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ పనులు కాకుండా ఎక్కువగా డ్రగ్స్ దందాపైనే దృష్టిపెట్టిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్ాచయి.
ఎన్సీబీ సమన్లు జారీ చేయడంతో దక్షిణ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్హౌజ్కు మధు మంతెన మధ్యాహ్నం 11.30 గంటలకు చేరుకొన్నారు. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఆయన సుమారు 6.30 గంటల ప్రాంతంలో ఎన్సీబీ కార్యాలయాన్ని వదిలి వెళ్లారు.
డ్రగ్స్ కేసులో జయా సాహాను గత రెండు రోజులుగా విచారిస్తున్నారు. బుధవారం మధు మంతెనను విచారణకు పిలుస్తూ సమన్లు జారీ చేశారు.
మధు మంతెన విషయానికి వస్తే.. టాలీవుడ్, బాలీవుడ్లో పలు చిత్రాలను నిర్మించిన ఆయన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు సమీప బంధువు. హిందీలో నిర్మాత అల్లు అరవింద్తో కలిస గజిని సినిమాను, ఆ తర్వాత రన్ చిత్రాన్ని రూపొందించారు. బెంగాళీలో ఆటోగ్రాఫ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రక్త చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత జూటా హై సహీ, మౌసమ్ అనే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.