Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
Dil Raju పై యువ నిర్మాత సెటైర్లు.. జంబలకిడి జారు మిఠాయి స్పీచ్ అంటూ యాంకర్ పంచ్
సినిమా ఫంక్షన్ల వేదికలపై అవకాశం దొరికితే.. పంచులు, సెటైర్లతో ఆకట్టుకొంటున్న యువ నిర్మాత ఎస్కేఎన్ తాజాగా మరోసారి ఏకంగా టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుపైనే సెటైర్లు గుప్పించారు. రైటర్ పద్మభూషణ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. అవసరం ఉన్నా లేకున్నా పంచులు వేసి.. వేదిక మీద ఉన్న సినీ ప్రముఖులకు, వేదిక కింద ఉన్న అతిథులు, మీడియా, సినీ అభిమానులకు, అలాగే యూట్యూబ్ ప్రేక్షకులకు మంచిగానే వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. రైటర్ పద్మభూషణ్ ఈవెంట్లో ఎస్కేఎన్ మాట్లాడుతూ..
ఛాయ్ బిస్కట్ సంస్థ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన తర్వాత చాలా సినిమాలకు హెల్ప్ అయ్యారు. వారు ఛాయ్ బిస్కెట్స్కు పరిమితం కాకుండా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి.. ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు. అందుకు ఈ కంపెనీ ఓనర్స్ అనురాగ్, శరత్కు కంగ్రాట్స్ అని అన్నాడు. వాళ్లు తీసిన మేజర్ బాగా హిట్టు అయింది. అలాగే బిర్యానీ ఎలా ఉందో తెలియాలంటే.. మొత్తం తినేయాల్సిన పనిలేదు. అందులో ముక్కలు తింటే సరిపోతుంది. సినిమా బాగుందో లేదో తెలియాలంటే.. ట్రైలర్ చూస్తే సరిపోతుంది. రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ చాలా బాగుంది అని SKN అన్నారు.
ఇంకా మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ.. నేను కొన్ని రాసుకొని వచ్చాను. అవి చదువుకొని మాట్లాడుతాను అంటూ హరీష్ శంకర్ అంటూ.. ఈ ట్రైలర్ చూస్తే.. ఇందులో కామెడీ ఇరుక్కు.. స్టోరి ఇరుక్కు.. సెంటిమెంట్ ఇరుక్కు అంటూ దిల్ రాజు ఇటీవల వారిసు ఫంక్షన్ చేసిన స్పీచ్ను అనుకరిస్తూ అందర్నీ వినోదంలో ముంచెత్తారు. అయితే ఎస్కేఎన్ దిల్ రాజుపై సెటైర్లు వేస్తుండగా.. పక్కనే ఉన్న సీతారామం డైరెక్టర్తో హరీష్ శంకర్ గుసగుసలాడుతూ కనిపించాడు. స్పీచ్ ముగిసిన తర్వాత జంబలకిడి జారు మిఠాయి స్పీచ్ యాంకర్ పంచ్ విసిరింది.
ఇటీవల చెన్నైలో వారిసు ఆడియో ఫంక్షన్లో సినిమా గురించి మాట్లాడుతూ.. డ్యాన్సులు ఇరుక్కు.. మ్యూజిక్ ఇరుక్కు.. అంటూ ప్రేక్షకులను హుషారెత్తించేందుకు తమిళంలో దిల్ రాజు ప్రసంగించారు. ఆ స్పీచ్ను నెటిజన్లు భారీగా ట్రోల్ చేయడం తెలిసిందే. తాజాగా ఎస్కేఎన్ కూడా అనుకరించాడు.. ఈ ఈవెంట్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుపై సెటైర్లు వేశాడా? లేక ట్రోల్ చేశాడా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఎస్కేఎన్ స్పీచ్పై దిల్ రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
ఇక ఇదిలా ఉంటే.. రైటర్ పద్మభూషణ్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ను ట్విట్టర్లో షేర్ చేయడం వైరల్గా మారింది. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.