Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
దర్శకుడిగా మారుతున్న నిర్మాత విశ్వనాధ్ తన్నీరు.. ఓ మంచి మెసేజ్ ఇస్తూ!
సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు దర్శకుడిగా మారబోతున్నాడు. ఇటీవలే 'M6' అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన స్వీయ దర్శకత్వంలో విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.
ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు స్పందిస్తూ.. ''సినిమా మీద ప్యాషన్తో ఈ రంగం లోకి వచ్చిన నేను "M6" సినిమాతో నిర్మాతగా మారాను. అయితే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా. చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది. కంటెంట్ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా ఈ చిత్రం లోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. ఇందులో హీరోగా మా గత చిత్రం "M6"లో హీరోగా చేసిన ధ్రువ నటిస్తున్నాడు. మొత్తం 4 షెడ్యూల్స్లో హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం'' అన్నాడు.
హీరో ధ్రువ మాట్లాడుతూ..''M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నేను నటిస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాననే నమ్మకం ఉంది. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము'' అన్నారు.
ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో రాగిణి, డి.యస్. రావు , గురురాజ్, నామాల రవీంద్ర సూరి, మాస్టర్ జైనీత్, దిల్ రమేష్, శివమ్ శివరాత్రి, గిరి, తిలక్, నర్సిరెడ్డి, చంటి, సందీప్, కుమరం తదితరులు నటించనున్నారు.