Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పృథ్వీ రాసలీలలపై శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్.. అమ్మ దీనెమ్మ బత్తాయో!!
గత కొన్ని రోజులుగా థర్టీ ఇండస్ట్రీ పృథ్వీ రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన జరిపిన సరస సంభాషణ తాలూకు ఫోన్ రికార్డ్ బయటకురావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. ఇదిలాఉంటే తాజాగా ఈ వ్యవహారంలో వేలుపెడుతూ శ్రీ రెడ్డి కామెంట్ చేయడం మరింత సెన్సేషన్గా మారింది. వివరాల్లోకి పోతే..
ఎస్వీబీసీ చైర్మన్.. ఇటు సినిమా, అటు రాజకీయం
''ఏమిటి నాతోనే గేమ్సా.. థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇండస్ట్రీ ఇక్కడ.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా'' అంటూ భారీ డైలాగ్ చెప్పి ఫుల్ ఫేం అయ్యాడు నటుడు పృథ్వీ. ఆ తర్వాత రాజకీయ బాటపట్టిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చి ఎస్వీబీసీ చైర్మన్ పదవి సంపాదించాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఆయన పరిస్థితి దారుణంగా మారింది.
భవిష్యత్తుకు దెబ్బ.. ఆ ఒక్క ఫోన్ కాల్ ఎఫెక్ట్
ఒక్క ఫోన్ కాల్ పృథ్వీ జీవితంతో ఆడుకుంటోంది. మహిళతో మాట్లాడిన తీరు ఇండస్ట్రీలో లేకుండా పోయే పరిస్థితిని తెచ్చింది. అతితక్కువ కాలంలో ఫేమస్ కమెడియన్గా పేరు సంపాదించిన పృథ్వీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పరువుని ఆ ఫోన్ కాల్ గంగలో కలిపేసింది. ఇటు సినిమాలు, అటు రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసింది.
అనూహ్యంగా చైర్మన్ పదవి.. అది కూడా ఫట్
గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ.. ఆ పార్టీ అధికారం లోకి వచ్చాక అనూహ్యంగా ఎస్వీబీసీ చైర్మన్గా నియమితులయ్యారు. అక్కడ ఉద్యోగినితో పృథ్వీ రాసలీలలు సాగిస్తున్నారనే ఆరోపణలు, ఓ ఆడియో టేప్ బయటపడటంతో పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్.. హాట్ టాపిక్
ఈ నేపథ్యంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. పృథ్వీ జరిపిన ఆ సరస సంభాషణ ఎస్వీబీసీలోనే పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగినితో అని తెలుస్తోంది. ఆ ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంటరైన శ్రీ రెడ్డి.. హాట్ కామెంట్
పృథ్వీ లాంటి ఫేమస్ కమెడియన్, పైగా హాట్ ఇష్యూ కావడంతో ఇందులోకి ఎంటరైంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి. పృథ్వీ రాసలీలపై తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. ‘అమ్మ దీననమ్మ బత్తాయో... థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్.. ఏంటి ఆ కాల్ రికార్డ్' అంటూ తన సందేశం పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
శ్రీ రెడ్డి కామెంట్స్.. నెటిజన్స్ రియాక్షన్
ఆడియో టేప్ విన్న నెటిజన్లు.. పృథ్వీని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఆయనపై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ లోకి శ్రీ రెడ్డి కూడా ఎంటర్ కావడంతో 'ఎనీవే హ్యాపీ సంక్రాంతి పృథ్వీ, శ్రీరెడ్డి' అంటూ ఇద్దరికీ కలిపి విష్ చేస్తున్నారు.
Recommended Video
కుట్ర పూరితంగా ఆరోపణలు.. పృథ్వీ ఆవేదన
మరోవైపు తనపై ఎవరో కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేస్తున్నారని, తాను తప్పు చేస్తే చెప్పుదెబ్బలు తినిడానికైనా రెడీ అంటున్నాడు పృథ్వీ. ‘నాకూ ఓ కుటుంబం ఉంది. నాకు పిల్లలు ఉన్నారు.. ఆరోపణలు నిరూపితం కాకుండా ఇలా వైరల్ చేయడం మంచిది కాదు' అని పృథ్వీ అంటున్నాడు.