Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవర్స్టార్తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ.. క్రేజీ టైటిల్ కూడా ఖరారు..
కేజీఎఫ్ చాప్టర్ బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జాతకమే మారిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ దశలో ఉండగానే స్టార్ హీరోలు ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. కేవలం కన్నడ పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు ఆయనతో పనిచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఆయనతో పనిచేయడానికి కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ సిద్ధమయ్యారు.
మార్చి 17వ తేదీన జన్మదినం జరుపుకొన్న పునీత్ రాజ్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుందనే స్పష్టం చేశారు. కేజీఎఫ్ లాంటి డైరెక్టర్తో ప్రతీ ఒక్కరు పనిచేయాలని కోరుకొంటారు. చాలాకాలంగా కథపై చర్చలు జరుపుతున్నాం. ఆ సినిమాకు ఆహ్వాన అనే టైటిల్ కూడా ఖరారు చేశాం అని పునీత్ వెల్లడించారు.
ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ యువరత్న అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా డైలాగ్ టీజర్ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ఆయన సరసన సాయేషా హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి ఆమె అడుగుపెడుతున్నారు.