Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవర్స్టార్తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ.. క్రేజీ టైటిల్ కూడా ఖరారు..
కేజీఎఫ్ చాప్టర్ బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జాతకమే మారిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ దశలో ఉండగానే స్టార్ హీరోలు ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. కేవలం కన్నడ పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు ఆయనతో పనిచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఆయనతో పనిచేయడానికి కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ సిద్ధమయ్యారు.
మార్చి 17వ తేదీన జన్మదినం జరుపుకొన్న పునీత్ రాజ్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుందనే స్పష్టం చేశారు. కేజీఎఫ్ లాంటి డైరెక్టర్తో ప్రతీ ఒక్కరు పనిచేయాలని కోరుకొంటారు. చాలాకాలంగా కథపై చర్చలు జరుపుతున్నాం. ఆ సినిమాకు ఆహ్వాన అనే టైటిల్ కూడా ఖరారు చేశాం అని పునీత్ వెల్లడించారు.
ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ యువరత్న అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా డైలాగ్ టీజర్ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ఆయన సరసన సాయేషా హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి ఆమె అడుగుపెడుతున్నారు.