Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవర్స్టార్తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ.. క్రేజీ టైటిల్ కూడా ఖరారు..
కేజీఎఫ్ చాప్టర్ బ్లాక్బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జాతకమే మారిపోయింది. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ దశలో ఉండగానే స్టార్ హీరోలు ఆయనతో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. కేవలం కన్నడ పరిశ్రమలోనే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోలు ఆయనతో పనిచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోల ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఆయనతో పనిచేయడానికి కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ సిద్ధమయ్యారు.
మార్చి 17వ తేదీన జన్మదినం జరుపుకొన్న పునీత్ రాజ్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తుందనే స్పష్టం చేశారు. కేజీఎఫ్ లాంటి డైరెక్టర్తో ప్రతీ ఒక్కరు పనిచేయాలని కోరుకొంటారు. చాలాకాలంగా కథపై చర్చలు జరుపుతున్నాం. ఆ సినిమాకు ఆహ్వాన అనే టైటిల్ కూడా ఖరారు చేశాం అని పునీత్ వెల్లడించారు.
ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ యువరత్న అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా డైలాగ్ టీజర్ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ఆయన సరసన సాయేషా హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా కన్నడ పరిశ్రమలోకి ఆమె అడుగుపెడుతున్నారు.