Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నేనున్నాను అంటున్న హనుమంతుడు.. సంజయ్ దత్, చిరంజీవి చేతుల్లో
అనంత రూపాలతో, అనంత బాహువులతో మహా స్వరూపంగా ఈ లోకాన్ని సంరక్షిస్తున్న ఆంజనేయ భగవానునిపై ఈ దేశంలో తొలిసారిగా ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అమోఘ రీతిలో వెలువరించిన ఉపాస్య విశేష సంచిక ' నేనున్నాను' అద్భుత ఉపాస్య గ్రంధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీఠాధిపతులు, మఠాధిపతులు , మేధావి వర్గంతో పాటు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ ఉదయం ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నుండి ఈ ' నేనున్నాను ' గ్రంధాన్ని స్వీకరించిన బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ తన ఆరాధ్య దైవం ఆంజనేయునిపై ఇంతటి గ్రంధాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, భాష రాకున్నా ఈ మహా గ్రంధాన్ని తన పూజా మందిరంలో పూజ్య స్థానంలో ఉంచుతానని చెప్పారు. పురాణపండ శ్రీనివాస్ కి ఈ సందర్భగా ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, 'లెజెండ్' బాలకృష్ణ, దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్.కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్ తదితర సినీ ప్రముఖులు ఈ మహాగ్రంధాన్ని స్వీకరించి ఈ గ్రంథ సౌందర్యాన్ని, రచనా సంకలన వైభవాన్ని ప్రశంసించారు.
భారతదేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయ మూల విరాట్టులతో, యంత్ర మంత్రం తంత్రాత్మకంగా పురాణపండ శ్రీనివాస్ అద్భుతంగా రూపొందించిన ఈ 'నేనున్నాను ' మహాగ్రంధాన్ని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ' వారాహి చలన చిత్రం' అధినేత సాయి కొర్రపాటి సమర్పణాభావంతో ప్రచురించడం గమనార్హం.
అతి అరుదైన ఆంజనేయ వర్ణచిత్రాలతో, నాణ్యతా ప్రమాణాల అపురూప ముద్రణతో, పురాణపండ శ్రీనివాస్ అద్భుత భాషా సొగసులతో చాలా చక్కగా అందిన ఈ హనుమాన్ బడా బుక్ తెలుగులో ఇంతవరకూ ' న భూతొ న భవిష్యత్ ' అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
మంత్ర విద్యలకు మహాకేంద్రంగా ఈ హనుమాన్ బుక్ ని నందమూరి బాల కృష్ణ అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాలలోని ఆంజనేయాలయాలకు, వేదపాఠశాలలకు, పండిత ప్రముఖులకు గ్రంథాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు ఈ ఐదు వందల పేజీల ఆంజనేయ వైభవాన్ని సాయి కొర్రపాటి ఉచితంగా అంజేస్తుండతాన్ని పలువురు ప్రముఖులు అభినందనలు వర్షిస్తున్నారు.