Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డిస్టిబ్యూటర్ల లైగర్ పంచాయితీ.. చేతులెత్తేసిన పూరీ కనెక్ట్స్?
ఒక సినిమా విడుదలై విజయం సాధిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. పెట్టుబడి పెట్టినవారికి డబ్బు తిరిగొస్తుంది. ప్రాంతాలవారీగా సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు.. ఇలా నిర్మాతల నుంచి థియేటర్ల వరకు ఏయే విభాగాల్లో పెట్టుబడి పెట్టారో ఆయా విభాగాల నుంచి డబ్బులు వచ్చేస్తాయి. ఒక సినిమా విడుదలై పరాజయం పాలైనప్పుడు మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సినిమా ఫెయిలైతే ఎక్కువగా బయ్యర్లే నష్టపోతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపైనే ఉంటుంది. లైగర్ సినిమాతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదం విషయాల్లోకి వెళితే..
లైగర్... భారీ డిజాస్టర్
లైగర్ సినిమా ఎన్ని అంచనాల మధ్య విడుదలైందో మనందరికీ తెలిసిందే. కానీ అంచనాల్ని అందుకోలేక ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఎక్కువగా బయ్యర్లు నష్టపోయారు. వీరిని ఆదుకుంటామని పూరీ జగన్నాథ్, ఛార్మి చెప్పారంటూ మీడియాలో వార్తలు వచ్చాయికానీ అవన్నీ అవాస్తవాలంటున్నారు. బయ్యర్లను ఆదుకుంటామని నిర్మాతలు ఎటువంటి హామీ ఇవ్వలేదని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేనట్లుగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
మొదట్లో సిద్ధమైనా.. తర్వాత వెనకడుగు
బయ్యర్ల ఒత్తిడి మేరకు మొదట్లో పూరీ, చార్మి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పూరీ కనెక్ట్స్ కార్యాలయం కూడా చేతులెత్తేసిందని, నష్టం భరించడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. కొనుగోలు చేసి మీరు నష్టపోయారు.. అలాగే పెట్టుబడి పెట్టి సినిమా తీసి తాము కూడా నష్టపోయామని చెప్పినట్లు సమాచారం. కొంతమంది బయ్యర్లు పూరీ జగన్నాథ్తో క్లోజ్ గా ఉంటారని, వీరు ఆయన్ను రిక్వెస్ట్ చేయగా ఇప్పుడు కాకపోతే తర్వాత సినిమాకైనా న్యాయంచేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కొనుగోలు చేసినవారంతా నష్టపోయారు.
చాంబర్ పై ఒత్తిడి
బయ్యర్లందరూ హైదరాబాద్ ఫిలిం చాంబర్ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఏదో ఒక విధంగా తమ డబ్బులు ఇప్పించాలంటూ ఛాంబర్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారంటున్నారు. వీరంతా హైదరాబాద్లో తాజాగా ఒకచోట సమావేశమయ్యారు. ముందుగా పూరీ జగన్నాథ్ కార్యాలయంలో కూర్చొని సెటిల్ చేసుకోవాలని ఛాంబర్ పెద్దలు చెప్పారని, వీలుకాకపోతే తర్వాత చూద్దాములే.. అన్నారని ఒక బయ్యరు చెప్పారు. పూరీ జగన్నాథ్, ఛార్మి ఏం చేస్తారో చూడాలి.!!