Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘లైగర్’ కోసం రంగంలోకి దిగిన పూరి.. హీరోయిన్తో ముచ్చట్లు పెడుతున్న డైరెక్టర్
పూరి జగన్నాథ్ తన సినిమాలను ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాడో అందరికీ తెలిసిందే. పక్కా ప్లానింగ్తో ఒకసారి రంగంలోకి దూకాడంటే వెనుకడుగు వేసేదే ఉండదు. స్టార్ హీరో సినిమాలైనా సరే దాదాపు 60, 70 రోజుల్లో ముగించేస్తాడు. కానీ పూరి జగన్నాథ్ వేగానికి కరోనా అడ్డుకట్ట వేసేసింది. లైగర్ సినిమాను ఎంతో వేగంగా ఫినిష్ చేద్దామని పూరి ప్రయత్నించాడు. దానికి తగ్గట్టే అంతా ప్లాన్ చేసుకున్నాడు.
అలా మొదటి షెడ్యూల్ కానిచ్చాడు. ఆ వెంటనే కరోనా, లాక్డౌన్ వంటివి వచ్చాయి. అలా దాదాపు ఏడాది పాటు షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టకుండా నాలుగు గోడల మధ్యే ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు పూరి జగన్నాథ్ లైగర్ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ముందుగానే డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. సెప్టెంబర్ 9న లైగర్ను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించేశారు.
నిన్నటి నుంచి షూటింగ్ కూడా మొదలెట్టేశాడు. తాజాగా షూటింగ్ సెట్ నుంచి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో పూరి జగన్నాథ్ హీరోయిన్తో ముచ్చట్లు పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఏదో సీన్ కోసం ఇద్దరూ చర్చించుకున్నట్టున్నారనిపిస్తోంది. అయితే ఈ సీన్లో విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించలేదు. మొత్తానికి పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.