Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pushpak Vimanam hit.. ఫ్యామిలీ ఆడియన్స్కు ఆనంద దేవరకొండ థ్యాంక్స్
ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ హిట్ మూవీ పుష్పక విమానం. ఇటీవల విడుదలైన ఈ సినిమా హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంది. రిలీజైన ప్రతి థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆడియెన్స్తో స్పెషల్ గా ఇంటరాక్ట్ అయ్యింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు గీత్ సైని, శాన్వి మేఘన, దర్శకుడు దామోదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, నటుడు కిరీటి ప్రేక్షకులతో సరదాగా సినిమా గురించి ముచ్చటించారు.
ఈ సందర్భంగా పుష్పక విమానం సినిమా తమకు ఎంతగా నచ్చిందో ఆడియెన్స్ టీమ్ సభ్యులకు చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో కలిసి పుష్పక విమానం సినిమా చూసి ఎంజాయ్ చేశామని ఇంటరాక్షన్ లో పాల్గొన్న ప్రేక్షకులు చెప్పారు. లాక్ డౌన్ తర్వాత ఆడియెన్స్ కు ఒక మంచి నవ్వించే సినిమా అందించాలనే పుష్పక విమానం సినిమా చేసినట్లు ఆనంద్ దేవరకొండ అన్నారు.
తాము అనుకున్న పర్పస్ నెరవేరిందని, సినిమా హిట్ చేసినందుకు ఆడియెన్స్ కు థాంక్స్ చెప్పారు. హీరోయిన్ లు శాన్వీ మేఘన, గీత్ సైని, దర్శకుడు దామోదర పుష్పక విమానం చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి అక్కడి ప్రేక్షకులతో పంచుకున్నారు. పుష్పక విమానం సినిమా థియేటర్ లలో ఆడియెన్స్ ఎంతగా నవ్వుకున్నారో వీడియో ద్వారా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.