Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సాహో’ ట్రైలర్ చూసి పివి సింధు ఫిదా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సాహో'. ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
'సాహో' ట్రైలర్పై తాజాగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు స్పందించారు. 'సాహో ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇది చూసిన తర్వాత సినిమా చూడాలనే ఆసక్తి నాలో మరింత పెరిగింది. ప్రభాస్, శ్రద్దాకపూర్ మూవీ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఏర్పడింది. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.
ఈ చిత్రాన్ని హిందీతో తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. కేవలం నార్త్ ఇండియాలోనే 4500 స్క్రీన్లలో రిలీజ్ అవుతుండగా, సౌతిండియా వ్యాప్తంగా దాదాపు 2 వేల స్క్రీన్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Just saw #sahoo trailer and what a smash it is! Can't wait to see #prabhas & @ShraddhaKapoor with @UV_Creations hit it out of the park. Super pumped to see the film. All the best to entire cast and crew pic.twitter.com/D9fRbGTkSW
— Pvsindhu (@Pvsindhu1) August 13, 2019
సాహోలో హీరోయిన్ శ్రద్ధా కపూర్తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అన్ని భాషల నుంచి నటీ నటులను ఎంపిక చేశారు.