Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయుణమూర్తికి ప్రతిష్టాత్మక అవార్డు
సామాజిక అంశాలను అధారంగా చేసుకొని ప్రజలను చైతన్య పరిచే చిత్రాలను నిర్మిస్తున్న రెడ్స్టార్, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తిని ప్రతిష్ఠాత్మకమైన అవార్డు లభించింది. గత దశాబ్దకాలంగా దాసరి పేరున అవార్డులను ప్రదానం చేస్తున్న ఫాస్ ఫిలిం సొసైటీ, హైదరాబాద్ ఫాస్-దాసరి 2019 అవార్డులను ప్రకటించింది. ఆర్ నారాయణమూర్తిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ అవార్డును ఏప్రిల్ 28న రాజవుహేంద్రవరం, విక్రమ్ హాలులో బహూకరించనున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షులు డా. కె.ధర్మారావు తెలిపారు.
ఫాస్ అవార్డులలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయుణమూర్తి, దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, నిర్మాత సి కల్యాణ్, ఈటీవీ, టి.వి.9లకు ఫాస్-దాసరి 2019 సిల్వర్ పీకాక్ అవార్డులను అందిస్తున్నారు. అలాగే ఈ అవార్డులలో లయన్ ఎ.విజయ్కుమార్ (సాంస్కృతిక), డా.పి. కవులాప్రసాదరావు(హస్తకళ), జిత్మోహన్ మిత్ర (సంగీతం, నటన), పి.యుగంధర్ (కార్మిక సేవ)లకు ఆయా రంగాల్లో పురస్కార ప్రదానం జరుగుతుందని ధర్మారావు తెలిపారు.
ఫాస్-దాసరి 2019 రంగస్థల, టి.వి., సినీ త్రిరంగ ప్రతిభా అవార్డులను అల్లరి సుభాషిణి, వి.హెచ్.ఇ.ఎల్.ప్రసాద్, వి.రావుకృష్ణలకు అందిస్తారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాసరి సినీ చిత్ర కార్యక్రమంలో చంద్రతేజ, లలితారావు పాల్గొంటారని, ముక్కామల క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శ్రీధర స్వామీజీ ఆశీస్సులు అందచేస్తారని ధర్మారావు తెలిపారు.
ఈ అవార్డుల కార్యక్రమంలో రాజమండ్రి నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుదు దొండపాటి సత్యంబాబు ప్రధాన అతిథులుఆ పాల్గొంటారు.