Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ గా వస్తున్న లక్ష్మి రాయ్
మెగాస్టార్ చిరంజీవి మూవీ 'ఖైదీ నెం.150'లో రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన లక్ష్మీరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ సినిమా తర్వాత హిందీ, తమిళ, మలయాళం సినిమాలతో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ మళ్లీ ఇన్ని రోజులకు తెలుగులో 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి' అనే సినిమాకు కమిటైంది.
పూర్తిగా విలేజ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహత్, నవీన్ నేని, పంకజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది.
హరి గౌర వేర్ ఈజ్ వెంకటలక్ష్మికి సంగీతం అందిస్తున్నాడు. తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి చిత్రాన్ని ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లక్ష్మీరాయ్, పూజిత పొన్నాడ, మహత్, నవీన్ నేని, పంకజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: కిషోర్ కుమార్, నిర్మాతలు: ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి, బ్యానర్: ఏబిటి క్రియేషన్స్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి దీపక్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: తాటవర్తి కిరణ్, మ్యూజిక్: హరి గౌర, సినిమాటోగ్రఫి: దినేష్ రవీంద్రనాథ్, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ.