Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ గా వస్తున్న లక్ష్మి రాయ్
మెగాస్టార్ చిరంజీవి మూవీ 'ఖైదీ నెం.150'లో రత్తాలు రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన లక్ష్మీరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ సినిమా తర్వాత హిందీ, తమిళ, మలయాళం సినిమాలతో బిజీ అయిపోయిన ఈ బ్యూటీ మళ్లీ ఇన్ని రోజులకు తెలుగులో 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి' అనే సినిమాకు కమిటైంది.
పూర్తిగా విలేజ్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహత్, నవీన్ నేని, పంకజ్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక పాత్రలో నటించనుంది.
హరి గౌర వేర్ ఈజ్ వెంకటలక్ష్మికి సంగీతం అందిస్తున్నాడు. తాటవర్తి కిరణ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి చిత్రాన్ని ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి ఏబిటి క్రియేషన్స్ సంస్థపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లక్ష్మీరాయ్, పూజిత పొన్నాడ, మహత్, నవీన్ నేని, పంకజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు: కిషోర్ కుమార్, నిర్మాతలు: ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్ ఆనంద్ రెడ్డి, ఆర్కె రెడ్డి, బ్యానర్: ఏబిటి క్రియేషన్స్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి దీపక్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: తాటవర్తి కిరణ్, మ్యూజిక్: హరి గౌర, సినిమాటోగ్రఫి: దినేష్ రవీంద్రనాథ్, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ.