Raj Tarun's Aha Na Pellanta ఓటీటీ రిలీజ్కు రాజ్ తరుణ్ వెబ్ సిరీస్.. ఎప్పుడు? ఎక్కడంటే?
తమడా మీడియా బ్యానర్పై నిర్మాతలు సూర్య రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్ర నిర్మాణ సారథ్యంలో సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ అహనా పెళ్లంట. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 17వ తేదీన ఓటీటీ ద్వారా రిలీజ్ కానున్నది. రాజ్ తరుణ్ కెరీర్లో నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న రెండో ప్రాజెక్టు కావడం గమనార్హం.
ఇప్పటికే రిలీజైన అహనా పెళ్లంట వెబ్ సిరీస్కు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్తోపాటు మాస్ ఎలిమెంట్స్తో ఈ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్గా తెరకెక్కింది.

పెళ్లికి కొద్ది గంటల ముందు పెళ్లికూతురు జంప్ అయితే పెళ్లి కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంతో ఈ వెబ్ సిరీస్ వినోదాత్మకంగా, ఎమోషనల్గా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ప్రసారం కానున్నది.
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, పోసాని కృష్ణ మురళీ, వడ్లమాని శ్రీనివాస్, రఘు, మధు నందన్, దీపాళి శర్మ, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాత: సూర్య రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహర్ష బసవ
స్టోరి, స్క్రీన్ ప్లే: షేక్ దావూద్ జీ
డీవోపీ: నాగే బానెల్లి, ఆష్కర్ ఆలీ
మ్యూజిక్ డైరెక్టఱ్: జుదా శాండీ,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: పవన్
ఎడిటర్: మధు రెడ్డి
డైలాగ్స్: కల్యాణ్ రాఘవ్
ఓటీటీ రిలీజ్: 2022-11-17
ఓటీటీ రిలీజ్: జీ6


Click it and Unblock the Notifications











