Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్ లో మరో విషాదం.. మెగా ఫ్యామిలీ సన్నిహిత వ్యక్తి మృతి..!
కరోనా సెకండ్ వేవ్ ఎవర్నీ వదలడం లేదు.. సెలబ్రిటీల మొదలు సామాన్యుల దాకా ఈ సెకండ్ వేవ్ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి వేవ్ లో కేసులు తక్కువగానే ఉండేవి మరణాలు తక్కువగానే ఉండేవి. కానీ ఈ సెకండ్ వేవ్ మొదలయ్యాక కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.
మరో వ్యక్తి
కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక కరోనా ధాటికి టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది యువ దర్శకులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని సినిమాలకు దర్శకత్వం విభాగంలో పనిచేసిన అంబటి రాజా కన్నుమూసినట్లు తెలుస్తోంది.. ఆయన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు చెబుతున్నారు. ఆయన గత కొద్ది రోజుల క్రితం కరోనా సోకగా ఆయన చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న పొద్దుపోయాక కన్నుమూసినట్లు తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు
అంబటి రాజా మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా నాగబాబుతో ఆయన ఎక్కువ సన్నిహితంగా మెలిగే వారని తెలుస్తోంది. నాగబాబు డిజిటల్ మీడియా వేదికగా ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలలో ఈయన కూడా భాగం అయ్యారని తెలుస్తోంది. ఆయన చనిపోవడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
కలచివేస్తోంది
రాజా మరణానికి సంబంధించి ముందుగా వినాయకుడు సినిమా ఫేమ్ కృష్ణుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ''నాగబాబుకు చాలా దగ్గరి వ్యక్తి, నా శ్రేయోభిలాషి రాజా మరణం కలచివేస్తోంది'' అని పేర్కొన్న ఆయన ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని అన్నారు. దేవుడు మంచి వాళ్ళని ముందే తీసుకు వెళ్లి పోతారు అని కృష్ణుడు కామెంట్ చేశారు.
Recommended Video
షాక్ అయ్యాను
ఇక
ఆయన
గురించి
మెగా
ఫ్యామిలీకి
చెందిన
వెంకట్
రాహుల్
స్పందిస్తూ
ఆయన
మరణ
వార్త
విని
షాకయ్యాను
అని
ఆయన
కుటుంబం
ఈ
సమయంలో
బలంగా
ఉండాలని
కోరుతున్నానని
అన్నారు.
ఇక
జబర్దస్త్
కమెడియన్
గడ్డం
నవీన్
కూడా
రాజా
మరణానికి
సంబంధించి
సంతాపం
వ్యక్తం
చేశారు.
అలాగే
దర్శకుడు
వి.ఎన్
ఆదిత్య
కూడా
ఆయన
మరణం
గురించి
స్పందించారు.
ఆయన
మరణం
గురించి
తెలిసి
షాక్
అయ్యానని,
ఆయన
కుటుంబానికి
బలం
చేకూర్చాలని
ఆయన
కోరారు.