మినీ బాహుబలిలా ‘రథం’.. సినిమా అద్భుతంగా.. నిర్మాత రాజా
రాజగురు ఫిలిమ్స్ బ్యానర్పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మిస్తున్న చిత్రం రథం. ఈ చిత్ర టీజర్, ఒక పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రథంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా రిలీజ్ చేశారు.
'బిల్ గేట్స్' అంటూ ప్రారంభమయ్యే ఈ పాట మాస్ను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ని అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత రాజా మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అవుతుంది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి అభినందించారు. ఇది మినీ బాహుబలి అవుతుందనే నమ్మకం ఏర్పడింది అని అన్నారు.

కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాజ్గురు ఫిలిమ్స్ బ్యానర్ను ఏర్పాటు చేశాం. త్వరలోనే రెండో సినిమా ప్రారంభమవుతుంది అని రాజా తెలిపారు.

గీత్ ఆనంద్, చాందినీ భగ్వానాని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రథం తెరకెక్కింది. ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











