Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Shocking : రాజ రాజ చోర, బెల్ బాటమ్, క్రేజీ అంకుల్స్పై పైరసీ దెబ్బ.. హెచ్ డీ క్వాలిటీతో ఫ్రీ డౌన్లోడ్
కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత సినిమాల పరిస్థితి నెమ్మదిగా ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే పెద్ద స్టార్ల సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో దసరాకు అలాగే సంక్రాంతికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాలు చాలా వరకు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అయితే అలా రిలీజ్ అవుతున్న ప్రతి చిన్న సినిమా పైరసీ బారిన పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు ఒక బాలీవుడ్ సినిమా ఒకటి 3 టాలీవుడ్ సినిమాలు విడుదలవ్వగా ఈ నాలుగు సినిమాలు ఆన్లైన్ లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈరోజు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన బెల్-బాటం, శ్రీముఖి ప్రధాన పాత్రలో రూపొందించిన క్రేజీ అంకుల్స్, శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజ రాజ చోర, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన కనబడుట లేదు అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఈ నాలుగు సినిమాలు కూడా ఈ రోజు విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తమిళ్ రాకర్స్, అలాగే మూవీరూల్జ్ వంటి వెబ్ సైట్స్ లో సినిమాలు గంటల వ్యవధిలోనే ప్రత్యక్షం అయ్యాయి. దీంతో దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి సినిమాలు చేసి ప్రేక్షకుల కోసం విడుదల చేస్తూ ఉంటే పైరసీ భూతం తమ వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన బెల్-బాటం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీముఖి, పోసాని కృష్ణ మురళి, మనో, రాజా రవీంద్ర, బండ్ల గణేష్ వంటి వారు కీలక పాత్రలో నటించిన క్రేజీ అంకుల్ సినిమా విడుదలకు ఒక రోజు ముందు వివాదంలో చిక్కుకుంది. అయినా సరే సినిమాలో వివాదాస్పద అంశాలు లేక పోవడంతో కొంతమేర రిలీఫ్ లభించినట్లుగానే చెప్పాలి.
ఇక సునీల్ ప్రధాన పాత్రలో రూపొందించబడిన కనబడుటలేదు అనే సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఊహించినంత మేర ఆకట్టుకోలేదు అని అంటున్నారు. రాజ రాజ చోర సినిమా శ్రీ విష్ణు సింగిల్ హ్యాండ్ తో నడిపించడానికి ప్రయత్నం చేశాడని అంటున్నారు. మొత్తం మీద దాదాపు నాలుగు సినిమాలకు కాస్త మంచి ఫలితాలు వచ్చినా ఈ పైరసీ భూతం మాత్రం వెంటాడుతూనే ఉంది.. అయితే ఏకంగా లీకైన కంటెంట్ హెచ్డీ క్వాలిటీ తో దర్శనమివ్వడం ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. అయితే దియేటర్లలో రిలీజ్ చేస్తే పరిస్థితి ఇలా ఉంది అనుకుంటే డిజిటల్ మాధ్యమాలలో విడుదల చేసినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని గంటలలో ప్రత్యక్షం అవుతుంటే డిజిటల్ మాధ్యమాల్లో రిలీజ్ అయిన క్షణాల్లోనే ఈ పైరసీ వెబ్ సైట్స్ లో సినిమాలు ప్రత్యక్షం కావడం గమనార్హం.. ఏదేమైనా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటే గానీ ఇలాంటి పైరసీ వ్యవహారాలకు చెక్ పడదు అని చెప్పాలి. మరి చూడాలి ప్రభుత్వాలు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తాయో లేదో అనేది.