twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెర్రీ ప్లానింగే కారణం.. నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నా.. రాజమౌళి కామెంట్స్

    |

    సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 'మత్తు వదలరా'. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

    ప్రీ రిలీజ్ వేడుక.. రాజమౌళి

    ప్రీ రిలీజ్ వేడుక.. రాజమౌళి

    ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి 'మత్తు వదలరా' చిత్ర యూనిట్‌ని, డైరెక్టర్ రితేష్‌ని అభినందించారు. వేదికపై మాట్లాడుతూ యూనిట్ మొత్తానికి ప్రోత్సాహం ఇచ్చారు.

    జనాలకు నచ్చుతుందా? లేదా అనే టెన్షన్

    జనాలకు నచ్చుతుందా? లేదా అనే టెన్షన్

    ''మా కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ చిత్రంతో పరిచయం కావడం ఎంతో ఎమోషన్‌గా ఉంది. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు మన పిల్లలు కాబట్టి మనకునచ్చినా జనాలకు నచ్చుతుందా? లేదా అనే టెన్షన్ ఉంది. సినిమా చూస్తుంటే తీపి, కారం ఒకేసారి తిన్నట్టు అనిపించింది. చిత్రంలోని ప్రతి ఫ్రేము నన్ను ఆకట్టుకుంది. సింహా, కాలభైరవలకు చక్కటి భవిష్యత్తు ఉంది'' అని రాజమౌళి అన్నారు.

    కారణం చెర్రీ ప్లానింగే

    కారణం చెర్రీ ప్లానింగే

    ఈ చిత్ర నిర్మాత చెర్రి గురించి మాట్లాడిన రాజమౌళి.. ''చెర్రీ ఎంతో ప్లానింగ్ వున్న వ్యక్తి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తాడు. అందుకే చెర్రి అంటే నాకు చాలా ఇష్టం. నా యమదొంగకు నిర్మాత చెర్రినే. నా కెరీర్‌లో అతి తక్కువ సమయంలో తీసిన సినిమా ఇదే. దానికి కారణం చెర్రీ ప్లానింగే'' అని అన్నారు.

     తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను

    తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను

    ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. ''మా పిల్లల్ని నేను ఎప్పుడూ తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను. ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతుంటాను.కానీ ఇప్పుడు నా తనయులను చూస్తుంటే గర్వంగా ఉంది. ఓ అబ్బాయి సంగీతం చేశాడనో, మరో అబ్బాయి నటించాడనో పుత్రోత్సహం, గర్వం కలగలేదు. బాహుబలిలో దేవసేన పరిచయ సన్నివేశానికి కాలభైరవ సంగీతం అందించాడు. హంసనావపాటలో రెండు లైన్లు పాడాడు. ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు'' అని అన్నారు.

     భావోద్వేగానికి గురవుతున్నా.. జక్కన్న ట్వీట్

    భావోద్వేగానికి గురవుతున్నా.. జక్కన్న ట్వీట్

    ఇటీవలే రాజమౌళి ‘మత్తు వదలరా' సినిమాను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మా ఇద్దరు కుర్రాళ్ళు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో సినీ అరంగేట్రం చేస్తున్నారు. నేను భావోద్వేగానికి గురవుతున్నాను. దర్శకుడు రితేష్ రానా బాగా తీశారు. మూవీ విడుదల రోజు (డిసెంబర్ 25) నేను షూటింగ్ మానేస్తా అంటూ ట్వీట్ ద్వారా ఆయన తెలిపారు.

    English summary
    Rajamouli doing a prestigious project named as RRR. He attended Mathu Vadalara pre release event and says some words about movie unit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X