Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చెర్రీ ప్లానింగే కారణం.. నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నా.. రాజమౌళి కామెంట్స్
సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 'మత్తు వదలరా'. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
ప్రీ రిలీజ్ వేడుక.. రాజమౌళి
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి 'మత్తు వదలరా' చిత్ర యూనిట్ని, డైరెక్టర్ రితేష్ని అభినందించారు. వేదికపై మాట్లాడుతూ యూనిట్ మొత్తానికి ప్రోత్సాహం ఇచ్చారు.
జనాలకు నచ్చుతుందా? లేదా అనే టెన్షన్
''మా కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ చిత్రంతో పరిచయం కావడం ఎంతో ఎమోషన్గా ఉంది. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు మన పిల్లలు కాబట్టి మనకునచ్చినా జనాలకు నచ్చుతుందా? లేదా అనే టెన్షన్ ఉంది. సినిమా చూస్తుంటే తీపి, కారం ఒకేసారి తిన్నట్టు అనిపించింది. చిత్రంలోని ప్రతి ఫ్రేము నన్ను ఆకట్టుకుంది. సింహా, కాలభైరవలకు చక్కటి భవిష్యత్తు ఉంది'' అని రాజమౌళి అన్నారు.
కారణం చెర్రీ ప్లానింగే
ఈ చిత్ర నిర్మాత చెర్రి గురించి మాట్లాడిన రాజమౌళి.. ''చెర్రీ ఎంతో ప్లానింగ్ వున్న వ్యక్తి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తాడు. అందుకే చెర్రి అంటే నాకు చాలా ఇష్టం. నా యమదొంగకు నిర్మాత చెర్రినే. నా కెరీర్లో అతి తక్కువ సమయంలో తీసిన సినిమా ఇదే. దానికి కారణం చెర్రీ ప్లానింగే'' అని అన్నారు.
తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. ''మా పిల్లల్ని నేను ఎప్పుడూ తిడుతూ ఎంకరైజ్ చేస్తుంటాను. ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతుంటాను.కానీ ఇప్పుడు నా తనయులను చూస్తుంటే గర్వంగా ఉంది. ఓ అబ్బాయి సంగీతం చేశాడనో, మరో అబ్బాయి నటించాడనో పుత్రోత్సహం, గర్వం కలగలేదు. బాహుబలిలో దేవసేన పరిచయ సన్నివేశానికి కాలభైరవ సంగీతం అందించాడు. హంసనావపాటలో రెండు లైన్లు పాడాడు. ప్రేక్షకులందరూ మెచ్చుకున్నారు'' అని అన్నారు.
భావోద్వేగానికి గురవుతున్నా.. జక్కన్న ట్వీట్
ఇటీవలే రాజమౌళి ‘మత్తు వదలరా' సినిమాను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మా ఇద్దరు కుర్రాళ్ళు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో సినీ అరంగేట్రం చేస్తున్నారు. నేను భావోద్వేగానికి గురవుతున్నాను. దర్శకుడు రితేష్ రానా బాగా తీశారు. మూవీ విడుదల రోజు (డిసెంబర్ 25) నేను షూటింగ్ మానేస్తా అంటూ ట్వీట్ ద్వారా ఆయన తెలిపారు.