Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్నికలవేళ రాజశేఖర్ పొలిటికల్ డ్రామా ‘అర్జున’
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఆగిపోయిన హీరో రాజశేఖర్ నటించిన పొలిటికల్ డ్రామా మూవీ విడుదలకు సిద్ధమౌతోంది. 'అర్జున' టైటిల్తో రూపొందిన ఈ చిత్రానికి కణ్మని దర్శకత్వం వహించారు. రాజశేఖర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు.
'మా'
ఎన్నికలు:
పోటీలో
ఉన్నది
వీరే..
ఎవరు
ఏ
ప్యానెల్
వైపు?
2012లో విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సికె ఎంటర్టెన్మెంట్స్, హ్యాపీ మూవీస్ సంస్థలు మార్చి 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.
రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్లలో రాజశేఖర్ లుక్ డిఫరెంటుగా ఉంది. ఏడెనిమిదేళ్ల క్రితం తీసిన సినిమా కావడంతో రాజశేఖర్ మరింత యంగ్ లుక్తో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' అనే చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 'పిఎస్వి గరుడవేగ' తర్వాత రాజశేఖర్ మళ్లీ హీరోగా నిలదొక్కుకుని విభిన్నమైన చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.