Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బడా నిర్మాత, హీరో కూతుళ్ల వ్యవహారం.. ఆ రూమ్లో అలా.. రాకేష్ మాష్టర్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు. శ్రీ రెడ్డిపై కామెంట్స్, సినీ ఇండస్ట్రీ వ్యవహారాలు, ప్రముఖులపై చేసిన కామెంట్లు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. రాకేష్ మాష్టర్ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ బడా నిర్మాత, బడా హీరో కూతుళ్ల వ్యవహారం గురించి బయట పెట్టాడు. ఈ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
ఛార్మీ అలా చూసింది..
తాను ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేశానని, ఇప్పుడున్న హీరోల్లో ఎంతో మంది తన శిష్యులేనని, ప్రభాస్ కూడా తన శిష్యుడేనని తెలిపాడు. నీతోడు కావాలి సినిమాకు కొరియోగ్రఫర్గా పనిచేశానని, అది ఛార్మీకి మొదటి సినిమా అని తెలిపాడు. అయితే మళ్లీ చక్రం సమయంలో చార్మీని పలకరిస్తే.. ఎవరో తెలీదనట్టు చూసిందని చెప్పుకొచ్చాడు. ఎందుకురా? పలకరించావ్ అని తన మనసులో అనుకున్నట్లు తెలిపాడు.
వారిద్దరు అలా..
తానొక సారి జై చిరంజీవ షూటింగ్ కోసమని అమెరికా వెళ్లినట్టు తెలిపారు. ఆ మూవీ నిర్మాత అశ్వనీదత్ అని చెప్పుకొచ్చాడు. అయితే అక్కడ అశ్వనీదత్ కూతురు, మోహన్ బాబు కూతురు ఇద్దరు కలిసి బీర్ తాగుతూ కనబడ్డారని తెలిపాడు. అది చూసి తాను షాక్ అయి మేనేజర్ను అడిగానని తెలిపాడు. కల్చర్ మారుతూ వస్తుందని చెప్పుకొచ్చాడు.
ఎవ్వరికీ భయపడను..
అక్కడ అలా ఉంటారు.. ఇక్కడికి వస్తే.. మాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు అని కలరింగ్ ఇస్తారంటూ సెటైర్ వేశాడు. క్రమశిక్షణ అంటుంటారు కదా అని సదరు యాంకర్ ప్రశ్నిస్తే.. తెలుస్తోంది కదా క్రమశిక్షణ అంటే.. తానే కళ్లార చూశానని, చూసిందే చెబుతున్నానని, తనకేమీ భయం లేదని ఎవ్వరి ముందైనా చెబుతానని అన్నాడు.
వాళ్లు కూడా సాక్ష్యం..
తనకు మోహన్ బాబు అంటే గౌరవమేనని, ఒకవేళ ఆయన ఫోన్ చేసిన తనను తిడితే.. తాను కూడా అలాగే తిడతానని చెప్పుకొచ్చాడు. తనకు కూడా అభిమానులున్నారని, ఒకవేళ తాను చెప్పినదానికి అక్కడి వారు కూడా సాక్ష్యంగా ఉన్నారని, బయట వారు ఎలా తాగారో, తిరిగారో వారు కూడా అదే చెబుతారని తెలిపాడు.