Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా గుట్టు విప్పేందుకు రెడీ.. ఆకట్టుకునేందుకు వస్తోన్న‘పలాస’ హీరో
ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది కరోనా గురించే. ఎలా పుట్టింది? విరుగుడు ఏంటి? అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా ఈ వైరస్ను చైనాయే ప్రపంచం మీదికి వదిలిందనే ఓ వాదన కూడా ఉంది. ఈ క్రమంలో కరోనా వైరస్పై సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆర్జీవీ అయితే లాక్ డౌన్లోనే కరోనా వైరస్ సినిమాను తెరకెక్కించేశాడనుకోండి అది వేరే విషయం.
పలాస 1978 చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కు WHO (World Hazard Ordinance) అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది.
హీరో రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్కి మంచి స్పందన లభిస్తుంది. "I'm gonna tell god everything" వంటి వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలు తో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ కథతో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.