Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక మా పని పూర్తయింది.. ఒకే బాధ్యత మిగిలి ఉందంటూ రామ్ చరణ్ భావోద్వేగం
రేనాటి వీరుడు, తొలి స్వతంత్ర్య యోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా చిత్రాన్ని తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో నిలిచిపోయేలా.. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రేపు విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా భావోద్వేగమైన లేఖను విడుదల చేశారు.
కొన్ని రోజులుగా ప్రమోషన్లో బిజీగా ఉన్న చిరంజీవి, రామ్ చరణ్ నేడు వాటికి స్వస్తి పలికారు. ముంబై, బెంగళూరు, చెన్నై, కేరళ అంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్న చిరు, చెర్రీ ప్రమోషన్స్ హై రేంజ్లో చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున ఈ సినిమాను రేపు విడుదలచేయనున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన భావాలను అభిమానులతో పంచుకున్నాడు.
'ఇది నమ్మలేనటువంటి అద్భుతమైన ప్రయాణం. నా తండ్రి కోరికను నిజం చేయడంతో పాటు, దేశంలో నలువైపులా ఉన్న గొప్ప నటీనటులతో పనిచేయడం జీవితాంతం గుర్తుండిపోయే ఓ గొప్ప అనుభవం. సైరా రిలీజ్ కు దగ్గరపడుతున్న కొద్దీ.. నా లోపల అన్ని రకాల భావాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ జర్నీ పూర్తయి.. ఇన్ని రోజులు ఓ కుటుంబంలా కలిసిపోయిన మేము విడిపోతున్నందుకు ఓ వైపు బాధగా ఉన్నా.. మీ అందరూ సినిమాను చూసేందుకు మేము చేసిన ప్రయత్నం సఫలమైనందుకు మరోవైపు సంతోషంగా ఉంది.
దీంతో పాటు, నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా అభిమానులు, మీడియా, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మీ అందరి సహకారం లేకుంటే ఇదంతా ఇంత సులభంగా జరిగేది కాదు. ఈ సినిమాను మేము అనుకున్నట్లు తీయడానికి మా శక్తియుక్తులు ఒడ్డాము.ఆ విషయంలో నాకు సంతప్తిగా ఉంది. దీనంతటికి కారణం నా కాస్ట్ అండ్ క్రూ.. వారికి నేను రుణపడి ఉంటాను.
ఈ కలను నిజం చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి, నా తండ్రి కోసమే ఈ కథను తయారు చేసిన.. ఇదంతా జరగడానికి వెనకుండి నడిపిన బలం.. పరుచూరి బ్రదర్స్ గారికి, విజువల్ వండర్గా తీర్చిదిద్దిన రత్నవేలు, అద్భుతమైన సంగీతం అందించిన అమిత్ త్రివేది, ఈ కథను చెప్పడానికి మాటలు అందించిన సాయి మాధవ్ బుర్రా, రోమాలు నిక్కపొడుచుకునేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన జూలియస్ పేకియమ్.. అందమైన సాహిత్యాన్ని అందించిన సిరివెన్నెల సీతారామా శాస్త్రి గారికి.. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ధన్యవాదాలు.
గోసాయి వెంకన్నగా నటించిన అమితాబ్ సర్, వీరా రెడ్డిగా జగపతి బాబు, అవుకు రాజాగా కిచ్చా సుదీప్, సిద్దమ్మగా నయనతార, లక్ష్మీగా తమన్నా, రవికిషన్, అనుష్క చివరగా నా చెల్లి నిహారిక.. ఇలా సినిమా కోసం వారి ఆత్మను పెట్టి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో మా పని పూర్తైంది. ఇక ఈ సినిమాను మీకు ఇవ్వడమే మిగిలిన బాధ్యత. మేమంతా కలిసి చేసిన ఈ అద్భుతాన్ని మీరంతా చూడాలి.. ఆ సమయం కోసం ఇక ఎదురుచూడలేకపోతున్నా' అని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు.