Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మాల్దీవుల్లో ఉపాసన.. ఐ లవ్ యూ రామ్.. ప్రత్యేకమైన రోజు అంటూ!
మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన కుటుంబ, వ్యక్తిగత విషయాలను మెగా అభిమానులకు చేర్చడంలో ఉపాసన ముందుంటుంది. ఇంకా చెర్రీ, ఉపాసన వేసే హాలిడే ట్రిప్స్ తాలూకు విషయాలైతే ప్రతీ క్షణం అప్డేట్ చేస్తుంటుంది ఉపాసన.
My Dearest Mr C https://t.co/voZadtDABI thanks for making everyday so special. I REALLY LOVE U & LOOK UP TO U. Ur unconditional love & kindness inspires me. Thanks for an amazing birthday ❤️😘 pic.twitter.com/Qr2UYrd4Wa
— Upasana Konidela (@upasanakonidela) July 22, 2019
తమ తమ పనులతో బిజీగా ఉంటూనే కాస్త విరామం దొరికితే చాలు చెర్రీ- ఉపాసన జాలీ జాలీ షికార్లు కొడుతుంటారు. ఇటీవలే వీరి మ్యారేజ్ డే పురస్కరించుకొని ప్రీ వెడ్డింగ్ అంటూ ఆఫ్రికాలో షికారు చేసిన ఈ జంట.. అదే స్టైల్ లో ఉపాసన బర్త్ డేని ప్లాన్ చేశారు. జులై 20 వ తేదీన ఉపాసన బర్త్ డే సందర్బంగా మాల్దీవులకు వెళ్లారు ఉపాసన- రామ్ చరణ్. మాల్దీవుల్లోని అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఉపాసన.. రామ్ చరణ్ పై ప్రేమను కురిపిస్తూ ట్వీట్ చేసింది. ''ఐ లవ్ యూ రామ్ చరణ్.. నీతో ఉన్న ప్రతీ రోజు ఓ ప్రత్యేకమైన రోజుగా మలుస్తున్నందుకు కృతజ్ఞతలు. నీ ప్రేమ, దయాగుణం నాకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. నా పుట్టిన రోజును ఇలా ప్లాన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని పేర్కొంది ఉపాసన. ఈ మేరకు చెర్రీతో కలిసి మాల్దీవుల్లోని స్టీమర్ పై చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నప్పటి పిక్ షేర్ చేసింది.
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్గా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 న విడుదల కానుంది.