Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఆ దర్శకుడు చెప్పిన కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు RRR కి సంబంధించిన ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక టీజర్ ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చరణ్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్ అభిమానులకు ఎంతో కిక్కిచ్చాయి. చూస్తుంటే తప్పకుండా సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగలదని చెప్పవచ్చు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. RRR తరువాత ఎవరితో సినిమా చేయాలనే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్ ని ఫిక్స్ చేసుకున్నాడు. మరోవైపు దర్శకుడు రాజమౌళి కూడా మహేష్ బాబు కోసం కథ కూడా సిద్ధం చేశారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో తుది నిర్ణయానికి రాలేదు. చాలామంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికి ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు. అయితే చరణ్ ఒక కోలీవుడ్ దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరో కొత్త టాక్ వస్తోంది.
తమిళ్ లో ఇప్పుడిపుడే అగ్ర దర్శకుడిగా క్రేజ్ అందుకుంటున్న దర్శకుడు మోహన్ రాజా రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన తని ఒరువన్ సినిమాను చరణ్ తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అసలైతే ధృవ సినిమాను తెలుగులో ఈ దర్శకుడే తెరకెక్కించాలని ఆనుకున్నాడు.
కానీ అప్పుడు రామ్ చరణ్ ఒప్పుకోలేదు. ఇక రీసెంట్ గా దర్శకుడు మరో కొత్త కథను చెప్పగా చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వస్తోంది. పాన్ ఇండియా తరహా కాన్సెప్ట్ కావడంతో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.