Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
అక్క కోసం గన్ పట్టిన రామ్ చరణ్.. ఆ ఈవెంట్లో చెర్రీ సందడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అక్క సుష్మిత కోసం గన్ పట్టాడు. కానీ అది సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే. సుష్మిత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈమె నుంచి వస్తున్న తొలి ప్రాజెక్ట్ షూటౌట్ ఎట్ ఆలేరు. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 25న జీ 5లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన షో రీల్ ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో రామ్ చరణ్ విడుదల చేసాడు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది.
అరుదైన దివ్యభారతీ ఫోటోలు.. ఈ ఫోటోలు మీరు ఎప్పుడైనా చూశారా?
ఇక ఈ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. సుష్మిత ప్రొడక్షన్లో మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ రావాలని ఆకాంక్షించాడు. ప్రసాద్ ల్యాబ్లో జరిగిన షో రీల్ లాంఛ్ వేడుకలో పాల్గొని అక్కా బావతో పాటు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు మెగా పవర్ స్టార్. జీ 5 ఓటీటీకి హెడ్గా మాత్రమే కాకుండా... తన అక్క సుష్మిత, బావ విష్ణుకి మెంటర్గా ఉన్న ప్రసాద్ నిమ్మకాయలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు.
కరోనా మహమ్మారి కాలంలో 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' టీమ్ అంతా బయటకు వచ్చి తమకు సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్స్. అందరికీ ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందని.. ఎప్పటికీ మరువలేమని.. 2020 నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపాడు. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడినందుకు సంతోషంగా ఉందన్నాడు. డిసెంబర్ 25న విడుదలవుతున్న 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు'తో మంచి ఎండింగ్ ఇస్తామని ఆశిస్తున్నట్లు రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
యువ హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ హాట్ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్గా గ్యాలరీ