Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ చేతుల మీదుగా ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ ప్రారంభోత్సవం!
'వి ఎపిక్' మల్టీప్లెక్స్ పేరు 'సాహో' రిలీజ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా మారుమ్రోగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ థియేటర్లో ఆసియాలోనే అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ప్రభాస్ స్నేహితుడు, యువి క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వేమారెడ్డి వంశీకృష్ణరెడ్డి 'వి ఎపిక్' నిర్మాణంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారట.
ఆగస్టు 30న సాహో మూవీతో దీన్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి.... వంశీకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితుడు, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతున్నారని, ఆయన చేతులమీదుగానే ఈ బిగ్ స్క్రీన్ థియేటర్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో బిగ్ స్క్రీన్ సైజ్ 102.6 అడుగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తుతో ఉంటుందట. ప్రపంచంలోని అతి పెద్ద సిల్వర్ స్క్రీన్స్లో ఇది థర్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్గా చెప్పుకుంటున్నారు. ఆసియాలో ఇంత పెద్ద స్క్రీన్ ఇప్పటి వరకు ఎక్కడా లేదు.
ఈ మల్టీప్లెక్స్లో మొత్తం మూడు స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి అతిపెద్ద స్క్రీన్. ఇది 647 సీట్ల కెపాసిటీతో ఉంటుందని సమాచారం. మిగతా రెండు చిన్న స్క్రీన్లు 140 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కృష్ణం రాజు హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.