తెలంగాణలో పెద్ది టికెట్‌ ధరల పెంపు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'పెద్ది' విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

Also Read
మీనా చేసిన పెద్ద తప్పు అదేనా? నాగార్జునతో ఆ ఛాన్స్ వదులుకొన్నదా?
మీనా చేసిన పెద్ద తప్పు అదేనా? నాగార్జునతో ఆ ఛాన్స్ వదులుకొన్నదా?

ప్రస్తుతం 'పెద్ది'పై నెలకొన్న అంచనాలను పరిశీలిస్తే, ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. 'రంగస్థలం' తర్వాత మరోసారి గ్రామీణ నేపథ్యంలో మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్న చరణ్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికే మంచి ఆదరణ పొందాయి.

Recommended For You
దీపిక ఒక్కరే కాదు.. అల్లు అర్జున్ 'రాకా'లో మరో స్టార్ బ్యూటీ!
దీపిక ఒక్కరే కాదు.. అల్లు అర్జున్ 'రాకా'లో మరో స్టార్ బ్యూటీ!
Ram Charan s Peddi Gets Ticket Price Hike in Telangana

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పెద్ది' జోరు మొదలైంది. ప్రీమియర్ షోలు, పెరిగిన టికెట్ రేట్లు, అదనపు షోలతో ఈ సినిమా తొలి పది రోజుల్లోనే భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ అనుమతులు 'పెద్ది' చిత్రానికి మరింత బూస్ట్ ఇచ్చాయి. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

You May Also Like
నా జీవితానికి అసలైన అర్థం ఇదే.. శ్రీదేవి గుర్తొచ్చేలా.. జాన్వీ ఎమోషనల్!
నా జీవితానికి అసలైన అర్థం ఇదే.. శ్రీదేవి గుర్తొచ్చేలా.. జాన్వీ ఎమోషనల్!

సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు, అలాగే ప్రత్యేక ప్రీమియర్ షోలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర హోంశాఖ జీవో నెం.7973ను జారీ చేస్తూ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో 'పెద్ది' బాక్సాఫీస్ ప్రయాణానికి మరింత బలం చేకూరినట్లైంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూన్ 4 నుంచి జూన్ 13 వరకు మొత్తం 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు పెంపునకు అనుమతి లభించింది. ఈ పెంపు జీఎస్‌టితో కలిపి అమల్లో ఉండనుంది. పది రోజుల తర్వాత మళ్లీ సాధారణ టికెట్ ధరలే అమలులోకి రానున్నాయి.

విజయ్‌తో రిలేషన్ రూమర్స్‌.. త్రిష స్ట్రాంగ్ వార్నింగ్
విజయ్‌తో రిలేషన్ రూమర్స్‌.. త్రిష స్ట్రాంగ్ వార్నింగ్

అంతేకాకుండా అభిమానుల కోసం జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక షోల టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. రామ్ చరణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు సినిమా విడుదలకు ముందే 'పెద్ది'ని వీక్షించే అవకాశం దక్కడం విశేషం. ఇక రోజుకు నాలుగు షోల స్థానంలో ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. భారీ డిమాండ్ ఉన్న సినిమాలకు అదనపు షో అనుమతి కల్పించడం వల్ల మొదటి వారంలో భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Peddi: రామ్ చరణ్ మూవీని వదులుకున్న సూర్య హీరోయిన్.. కారణం వింటే షాకే!
Peddi: రామ్ చరణ్ మూవీని వదులుకున్న సూర్య హీరోయిన్.. కారణం వింటే షాకే!

అయితే ఈ నిర్ణయంలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా, సినీ కార్మికులకు కూడా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో 'పెద్ది'కి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X