Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాంగోపాల్ వర్మ ఇక తాత.. బిడ్డకు జన్మనిచ్చిన ఆర్జీవి కూతురు.. ట్వీట్తో ఆటపట్టించిన రాజమౌళి
Recommended Video
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాత అయ్యారు. తన కూతురు రేవతి ఓ పండంటి పాపకు జన్మనిచ్చారు. బంధాలు, అనుబంధాలకు రాంగోపాల్ వర్మ దూరంగా ఉండటం తెలిసిందే. అయితే తాత కావడంతో సినీ ప్రముఖులు కొందరు అభినందనలు తెలుపగా, మరొకొందరు సోషల్ మీడియాలో ఆట పట్టించే విధంగా కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకు జక్కన ఏమని ఆట పట్టించారంటే..
2013లో కూతురు పెళ్లి చేసిన ఆర్జీవి
కొద్దికాలం క్రితం రాంగోపాల్ వర్మ తన కూతురు రేవతి వివాహం 2013లో ప్రణవ్ అనే ఎన్నారైతో జరిపించారు. అప్పటి నుంచి రేవతి దంపతులు అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం రేవతి అమెరికాలో ఆడపిల్లకు జన్మనిచ్చారు. తల్లి, కూతురు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
వర్మ కుటుంబం ఆనందం
తన కూతురు రేవతి అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఆడపిల్లకు జన్మినిచ్చిన వార్తతో రాంగోపాల్ వర్మ కుటుంబంలో ఆనందం నెలకొన్నది. ఈ క్రమంలో ఆర్జీవిని సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకొనే ఆర్జీవి మాత్రం ఇప్పటికి పెదవి విప్పడం లేదు.
ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్
ఆర్జీవి తాత అయిన విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఆసక్తికరమైన ట్వీట్ను కూడా చేశారు. కంగ్రాట్స్ రాము తాతయ్య గారు. ఇక మీ మనవరాలు నీకు కళ్లెం వస్తుందని అనుకొంటున్నాను. సరేగానీ నిన్ను ఎలా పిలువాలి.. రాము తాత అనా లేక రాము నాన్న లేదా గ్రాండ్పా రాము అని పిలువాలా అంటూ ట్వీట్ చేశారు. జక్కన ట్వీట్కు రాం గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
వివాదాలకు కేంద్ర బిందువుగా
ఇక రాంగోపాల్ వర్మ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల తీసిన ఆఫీసర్, భైరవ గీత, కమ్మరాజ్యంలో కడప బిడ్డలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమాపై దృష్టిపెట్టారు. మరో హిందీ సినిమాను కూడా రూపొందిస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి వివాదాస్పద చిత్రంతో ఆర్జీవి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.