Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ సింగ్ రాజ్పుత్ని అందరూ మరిచిపోయారు.. బయోపిక్పై ఆర్జీవి హాట్ కామెంట్
వివాదం ఎక్కడుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ అక్కడే ఉంటారనేది అందరికి తెలిసిందే. బాలీవుడ్లో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం అత్యంత వివాదంగా మారింది. అయితే సుశాంత్ జీవితంలో చోటుచేసుకొన్న ముఖ్య సంఘటనల ఆధారంగా బయోపిక్ తీస్తున్నారనే వార్తలపై ఆర్జీవి స్పందించారు.
ఈ సందర్భంగా ఆర్జీవి స్పందిస్తూ.. సుశాంత్ డెత్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అందరూ అతడి మరణాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. అంతేకాకుండా ఆయన కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తికి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో సర్కస్ జరుగుతున్నది. చాలా మంది రెగ్యులర్గా ట్రెండ్ చేస్తూ తమాషాగా మార్చారు అని వర్మ పేర్కొన్నారు.
అయితే సుశాంత్ గురించి బయోపిక్ తీస్తానో లేదో నాకు తెలియదు. ఇప్పటికైతే ఆ వివాదం గురించి నేను పట్టించుకోవడం లేదు. ఒకవేళ నేను బయోపిక్ తీస్తే చాలా విషయాలను సేకరిస్తాను అని వర్మ చెప్పారు.
గతంలో సంచలన విజయాలను సినిమా ఇండస్ట్రీకి అందించిన వర్మ ఇటీవలే తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నా జన్మదిన కాదు. డెత్ డే అంటూ ట్వీట్ చేశారు. ఎందుకంటే నా జీవితంలో ఓ సంవత్సరం చచ్చిపోయింది అంటూ కామెంట్ చేశారు.