Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంగోపాల్ వర్మకు తీరని విషాదం.. దేవుళ్లు, మోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారంటూ ట్వీట్
కరోనావైరస్ విజృంభిస్తూ జీవితాలను విచ్చిన్నం చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పదునైన ట్వీట్లతో ప్రభుత్వాలను రఫాడిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుంభమేళాను నిర్వహించిన అధికారులును, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో నిలదీస్తున్నారు. తాజాగా తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు గౌరవ్ శర్మ కరోనా బారిన పడి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు.
ఈ విషాద సమయంలో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. గత రెండు వారాల క్రితం కోవిడ్ పరిస్థితుల గురించి మేమిద్దరం చర్చించుకొన్నాం. స్ట్రామ్ శర్మగా పేరున్న గౌరవ్ శర్మను కోవిడ్ పొట్టన బెట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఎంతో జీవితాన్ని చూశారు. అలాంటి వ్యక్తి మరణించారంటే నేను నమ్మలేకపోతున్నారు. మీకు ఆప్తులైన వారికి జరగకూడదని ఏదైనా జరిగితే వైరస్ ఇంత ప్రమాదకరమనేది అర్ధమవుతుంది అని అన్నారు.
కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలపై సెటైర్లు వేశారు. హాస్పిటల్లో బెడ్స్ లేవు. శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ లేదు. వ్యాక్సిన్ల కొరత, చివరకు చస్తే కాల్చి వేయడానికి కట్టెలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దేవతా దేవుళ్లు ఎక్కడ, నరేంద్రమోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారు అంటూ ఘాటుగా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.