Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
RAPO19: రామ్ కొత్త సినిమాపై గుడ్ న్యూస్: అప్పటి నుంచే రచ్చ అంటూ ప్రకటన
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' నుంచి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫుల్ జోష్లో కనిపిస్తున్నాడు. దీని తర్వాత 'రెడ్'తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ ఉస్తాద్ హీరో.. ఆ ఉత్సాహంతోనే మరో సినిమాను లైన్లో పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. షూటింగ్ మొదలవుతుంద అనుకున్న సమయంలోనే కరోనా రెండో దశ వచ్చింది. దీంతో అది కాస్తా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఓ న్యూస్ లీకైంది.
తాజా సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని - లింగుసామీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జూలై 12 నుంచి ప్రారంభం కాబోతుందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో 'బిగ్ న్యూస్.. రామ్ కొత్త సినిమా షూటింగ్ జూలై 12 నుంచి ప్రారంభం కాబోతుంది. మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి' అని పేర్కొన్నారు. దీంతో ఉస్తాద్ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. పర్మీషన్ వచ్చిన తర్వాత విదేశీ షెడ్యూళ్లను ప్లాన్ చేస్తారని సమాచారం.
పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. ఇందులో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అందులో ఒక పోలీస్ పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.