Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేసింది.. తమిళ్ దర్శకుడితో ఒకేసారి రెండు భాషల్లో..
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఉస్తాద్ స్టార్ గా మారిన రామ్ పోతినేని ఇటీవల రెడ్ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధిని కూడా పెంచుకుంటున్న రామ్ రిజల్ట్ తో సంబంధం లేకుండా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో ఒక తమిళ్ దర్శకుడితో వర్క్ చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఇప్పుడు అదే నిజమయ్యింది.
ఆ సినిమాతోనే అసలు మాస్ బయటపడింది
రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించి బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు వరకు కూడా రామ్ పోతినేనిలో అసలైన మాస్ యాంగిల్ ను ఎవరు చూపించలేదు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం తన స్టైల్ లో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఆ సినిమాతో రామ్ కూడా పర్ఫెక్ట్ మాస్ హీరో అని ఋజువయ్యింది.
సంక్రాంతి డీసెంట్ హిట్
రెడ్ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. తమిళ్ తడమ్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 5కోట్లకు పైగా ప్రాఫిట్స్ అంధించి సుపర్ హిట్ గా నిలిచింది. కిషోర్ తిరుమల ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి మరో మంచి హిట్ అందుకోవడంతో రామ్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది
నెక్స్ట్ సినిమాలో ఒక ఊర మాస్ లుక్కుతో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాను కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు చాలా రోజులుగా రూమర్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా అదే నిజమయ్యింది. లింగుస్వామి కథకు మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఆ సినిమాను తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించనున్నారు.
అప్పట్లో అల్లు అర్జున్ తో చేయాలని..
పందెంకోడి, అవారా వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న లింగుస్వామి చాలా కాలంగా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు.
అల్లు అర్జున్ తో చేయాలని అప్పట్లో బాగానే ట్రై చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మొత్తానికి ఫుల్ మాస్ కథతో రామ్ ను మెప్పించినట్లు సమాచారం. ఆ సినిమా కథకు తగ్గట్లు డిఫరెంట్ షేడ్స్ నటించి తన నట విశ్వరూపాన్ని చూపించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్. ఆ స్క్రిప్ట్ పై మనసు పారేసుకున్న రామ్ ఎలాగైనా ఈ ఏడాదిలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.