Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సముద్రతీరానికి 10 వేల అడుగుల ఎత్తులో రామ్ పోతినేని.. క్రేజీగా 'రెడ్' సాంగ్
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం రెడ్. ప్రస్తుతం యూరప్లోని అద్భుతమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుకొంటున్నది. ఇటలీలోని పరవ్వత తీరప్రాంతంలో అందాలకు నిలయమైన డొలమైట్స్ ప్రాంతంలో రెడ్ సినిమా పాటలను చిత్రీకరిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పలు హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మి స్తున్న'రెడ్' చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్నిడోలమైట్స్లో షూట్ చేయడం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ - ''ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్ లొకేషన్స్ లో రామ్, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభిమాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని టుస్కాన్ ,ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత ప్రాంతం. సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే! ఈ రెండు పాటలూ చాలా బాగా వచ్చాయి. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్ గా జరిగే వెనీడియా కార్నివాల్లో కూడా అనుమతి తీసుకుని పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. దీంతో ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్లో ఆ పాట చిత్రీ కరిస్తాం'' అని తెలిపారు.
చిత్ర సమర్పకులు కృష్ణ పోతినేని మాట్లాడుతూ ''ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ నుంచి వస్తున్న ఈ చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగినట్టే క్లాస్నీ, మాస్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఓపెనింగ్ రోజున ప్రకటించినట్టుగానే ఏప్రిల్ 9న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం'' అని చెప్పారు.
నటీనటులు,
సాంకేతిక
నిపుణులు
నటీనటులు:
రామ్,
నివేదా
పేతురాజ్,
మాళవికా
శర్మ,
అమృతా
అయ్యర్
తదితరులు
సంగీతం:
మణిశర్మ,
ఛాయాగ్రహణం:
సమీర్
రెడ్డి,
ఆర్ట్:
ఎ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్:
పీటర్
హెయిన్స్,
ఎడిటింగ్:
జునైద్,
సమర్పణ:
కృష్ణ
పోతినేని,
నిర్మాత:
'స్రవంతి'
రవికిశోర్,
దర్శకత్వం
:
కిశోర్
తిరుమల.