Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఛార్మితో రామ్కి చెడిందా..? హీరో రిప్లై చూడండి ఎలా ఉందో!
చాలా కాలం తర్వాత ఎనర్జిటిక్ రామ్ తన కెరీర్లో హిట్ సాధించాడు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో వచ్చిన హిట్ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా దూసుకుపోతోంది. అంతేకాదు రామ్ కెరీర్ని మలుపుతిప్పే సినిమా ఇదేనని అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా ఇచ్చిన కిక్ ఆయన్ను టాప్ రేంజ్ కి తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇస్మార్ట్ శంకర్ విషయంలో ఛార్మి, పూరి జగన్నాథ్ లతో రామ్కి బేధాభిప్రాయాలు వచ్చాయని వస్తున్న వార్తలు ఆయన అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆశించిన స్థాయిని మించి సక్సెస్ అయినా కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనకుండా ఈ పరిస్థితుల్లో ఆయన విదేశాలకు వెళ్ళడానికి కారణం దర్శకనిర్మాతలతో గొడవే అని ఆ వార్తల సారాంశం. అంతేకాదు హీరో రామ్ మొదట చెప్పిన రెమ్మ్యూనరేషన్ ఇవ్వకుండా అందులో సగం మాత్రమే ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పూరి, ఛార్మిలతో రామ్ గొడవపై సినీ లోకంలో చర్చలు మొదలయ్యాయి. దీంతో ఈ విషయమై తాజాగా ఓ ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు రామ్.
దర్శకనిర్మాతలతో గొడవ అని వస్తున్న వార్తలు చూసి పడిపడి నవ్వుకున్నా. అందులో నిజం లేదు.. సాధారణంగా ఇలాంటి తప్పుడు వార్తలకు నేను స్పందించను కానీ.. ఈ గాసిప్ మాత్రం సూపర్ అనిపించింది. 'బంగారం అండీ ఇలాంటోళ్ళు' అని పేర్కొన్నాడు రామ్. ఈ ట్వీట్ని పూరీ, ఛార్మి లకు కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లయింది.
మరోవైపు ఇస్మార్ట్ శంకర్ సినిమా 50 కోట్ల క్లబ్కి చేరువయ్యింది. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాలో రామ్ హీరోగా నటించగా.. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. రామ్ గోపాల్ వర్మ లాంటి బడా డైరెక్టర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.