Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యూట్యూబ్లో హీరో రామ్ రికార్డ్.. విడుదలైన మూడు రోజుల్లోనే 33 మిలియన్లు!
తెలుగు చిత్రాలకు ఇటీవల హిందీలో మంది డిమాండ్ ఏర్పడుతోంది. ఉత్తరాది సినీ అభిమానులు తెలుగు చిత్రాల పట్ల ఆకర్షితులవుతున్నారు. దీనితో తెలుగు చిత్రాల డబ్బింగ్, డిజిటల్ మీడియా హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. యూట్యూబ్ లో హిందీలోకి డబ్ అయిన అల్లు అర్జున్ చిత్రాలు వందల మిలియన్లలో వ్యూస్ సాధించడం చూస్తూనే ఉన్నాము. తాజాగా రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాన్ని యూట్యూబ్ లో హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు.
నెం 1 దిల్ వాలా పేరుతో విడుదలైన ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం మూడు రోజుల్లోనే 33 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇంత తక్కువ సాయంలో ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన ఏకైన తెలుగు చిత్రంగా ఉన్నది ఒక్కటే జిందగీ రికార్డ్ సృష్టించింది. ఈ చిత్ర హిందీ హక్కులని గోల్డ్ మైన్ టెలీ ఫిలిమ్స్ సంస్థ తీసుకుంది. రికార్డు వ్యూస్ తో ఈ చిత్రం యూట్యూబ్ లో దూసుకుపోతుండడంతో ఆ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది.
2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధిచలేదు. దేవిశ్రీ అందించిన సంగీతం మాత్రం సూపర్ హిట్ అయింది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. రామ్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు.