Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డీడీ నేషనల్లో శ్రీకృష్ణ సీరియల్.. రామాయణం తర్వాత ప్రేక్షకుల చెంతకు..
కరోనావైరస్ సమయంలో గృహ నిర్బంధంలో ఉంటున్న ప్రజలకు కాస్త వినోదం కలిగించడానికి టెలివిజన్ చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలను తెరపైకి తీసుకొచ్చారు. గతంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు.
గతంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను టెలివిజన్లకు హత్తుకొనేలా చేసిన రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణాన్ని రోజుకు రెండుస్లారు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో ప్రస్తుతం రామానంద్ సాగర్ రూపొందించిన శ్రీకృష్ణ టెలివిజన్ సీరియల్ను కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
శ్రీకృష్ణ టెలివిజన్ సీరియల్ను మళ్లీ ప్రసారం చేస్తున్నట్టు ప్రసార భారతీ, దూరదర్శన్ తన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా తెలిపారు. గోవర్ధనగిరిని ఎత్తుతున్న కృష్ణుడి సీన్ను ప్రోమోగా విడుదల చేశారు. ఇంకా డీడీ నేషనల్లో ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
ప్రస్తుతం రామాయణం సీరియల్ ఉదయం 9 గంటలకు ఒకసారి, మళ్లీ రాత్రి 9 గంటలకు మరోసారి ప్రసారం చేస్తున్నారు. ఈ సీరియల్కు మంచి ఆదరణ లభిస్తుండటంతో శ్రీకృష్ణ సీరియల్ను కూడా అందించాలనే ఆలోచనకు వచ్చారు. 221 ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరియల్లో బాలకృష్ణుడిగా స్వప్నిల్ జోషి, యువ కృష్ణుడిగా సర్వదమన్ బెనర్జీ కనిపించిన సంగతి తెలిసిందే.