‘రామాయణ‘ సుగ్రీవుడు కన్నుమూత.. ధృవీకరించిన సన్నిహితులు
దేశ టెలివిజన్ రంగంలో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్కు గొప్ప స్థానం ఉంది. అలాంటి సీరియల్లో సుగ్రీవుడుగా నటించిన శ్యాంసుందర్ కలానీ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారని రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ధృవీకరించారు.
రామానంద సాగర్ రూపొందించిన రామాయణ్లో సుగ్రీవుడిగా నటించిన శ్యాంసుందర్ ఇకలేరనే విసయం తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. వ్యక్తిగా గొప్పవారు. జెంటిల్మన్. అలాంటి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అరుణ్ గోవిల్ ట్వీట్ చేశారు.

కరోనావైరస్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో డీడీ నేషనల్ ఛానెల్లో ఉదయం 9 గంటలకు, అలాగే మళ్లీ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్నది. ఇటీవలే సుగ్రీవుడి కార్యెక్టర్ సీరియల్లో పరిచయం అయింది.
ప్రస్తుతం రామాయణం సీరియల్కు మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఈ తరం యువత కూడా రామాయణం ఆదరించడం పల్ల భారతీయ సంప్రదాయాలకు మంచి ఆదరణ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











