Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డబ్బింగ్ షురూ.. మొదలెట్టేసిన రమ్యకృష్ణ
ప్రస్తుతం రమ్యకృష్ణ నటిగా ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. వరుసగా మూడు ప్రాజెక్ట్లు లైన్లో ఉన్నాయి. పూరి జగన్నాథ్ లైగర్, కృష్ణవంశీ రంగ మార్తాండ, దేవా కట్టా రిపబ్లిక్ సినిమాల్లో రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. మళ్లీ బాహుబలి తరువాత తన స్థాయికి తగ్గ పాత్రలను రమ్యకృష్ణ పోషిస్తోంది. అయితే మొన్నటి వరకు రమ్యకృష్ణ లైగర్ మూవీ సినిమా షూటింగ్తో బిజీగా ఉంది.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ కాంబోలో సీన్స్ తెరకెక్కించారు. ఈ మేరకు బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.మరో వైపు కృష్ణవంశీ రంగమార్తాండ కూడా రెడీ అవుతోంది. అయితే రమ్యకృష్ణ ఇప్పుడు రిపబ్లిక్ మూవీకి డబ్బింగ్ చెప్పే పనుల్లో నిమగ్నమైంది. సాయి ధరమ్ తేజ్ దేవాకట్టా కాంబినేషన్లో రాబోతోన్న ఈ మూవీ డబ్బింగ్ పనులు తాజాగా ప్రారంభమయ్యాయి.
ఆ మధ్య నల్గొండలోని దేవరకొండ ప్రాంతంలో రిపబ్లిక్ టీం షూటింగ్ చేసిన విషయంతెలిసిందే. అయితే ఓ వైపు సినిమా షూటింగ్ పూర్తవ్వగానే.. ఇలా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించేశారు. ఈ మేరకు రమ్యకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ చెబుతూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ మూవీ ఫుల్ స్వింగ్లో ఉంది. సమ్మర్ కానుకగా జూన్ 4న ఈ మూవీ రాబోతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.