Don't Miss!
- Finance Layoff News: యూనీలివర్ 7,500 ఉద్యోగుల కోత.. పూర్తి వివరాలివే..
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- Sports SRH అసలు సమస్య అదే - మిథాలీ రాజ్
- News Plume: భారత్ లో అంతర్జాతీయ సంస్ధ ప్లూమ్ తొలి ఆఫీసు ప్రారంభం- ప్రత్యేకతలివే..!
- Technology Ai వీడియో కంటెంట్ ను గుర్తించడానికి Youtube కొత్త టూల్! ఎలా పనిచేస్తుంది?
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
‘సలార్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్: ప్రభాస్తో సీనియర్ హీరోయిన్ మరోసారి
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న చిత్రం 'సలార్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇలా షూటింగ్ మొదటి షెడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేశారు. అంతలో కరోనా ప్రభావం భారీగా పెరగడంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ వేశారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగ్ను పున: ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఓ న్యూస్ బయటకొచ్చింది.
'సలార్' మూవీని ప్రకటించినప్పటి నుంచే ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని.. పలానా హీరో కీలక పాత్ర చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సినిమానే మలుపు తిప్పే పవర్ఫుల్ రోల్ను ఆమె కోసం రెడీ చేశాడట ప్రశాంత్ నీల్. ఇక, గతంలో రమ్యకృష్ణ 'బాహుబలి' సినిమాలో ప్రభాస్కు తల్లిగా నటించిన విషయం తెలిసిందే. అందులో ఆమె క్యారెక్టర్ ఏ రేంజ్లో పండిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇదిలా ఉండగా.. 'సలార్'లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. అది కూడా తండ్రీ కొడుకుల పాత్రలు చేయబోతున్నాడని అన్నారు. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. శ్రీనిథి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగతోంది. ఇక, ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు.