Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'విరాటపర్వం'లో రానా, సాయిపల్లవి రోల్స్ ఇవే..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా తన కొత్త సినిమా స్టార్ట్ అయింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో రానాకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించనుంది. ఈ సినిమాకు 'విరాట పర్వం' అనే ఆసక్తికర టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇటీవలే హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.
గతంలో 'నీది నాది ఒకే కథ' లాంటి డిఫెరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ వేణు ఉడుగుల తన రెండో చిత్రంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది కానీ.. ఓ వైపు రానా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, మరోవైపు సాయి పల్లవికి కమిట్మెంట్స్ ఎక్కువగా ఉండటం కారణంగా కాస్త డిలే అయి చివరకు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
కాగా తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రానా, సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తున్నారట. రానా నక్సలైట్ పాత్ర పోషించనుండగా, సాయి పల్లవి జర్నలిస్ట్గా నటించనుందని తెలుస్తోంది. వృత్తిలో భాగంగా రానాను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సాయిపల్లవి.. అతనితో ప్రేమలో పడుతుందని, ఆ తర్వాత కొన్ని మలుపులు తిరిగి రానా జన జీవన స్రవంతిలోకి రావడం జరుగుతుందని అంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటి పోటిటికల్ బ్యాక్ గ్రౌండ్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
'విరాటపర్వం' చిత్రానికి బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది. వచ్చేవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలిసింది. రానా, సాయి పల్లవి మొదటిసారి జోడీ కడుతున్న ఈ చిత్రం ఇద్దరి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చిత్రయూనిట్ చెబుతోంది.