twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎట్టకేలకు ‘విరాట పర్వం’ విడుదలపై క్లారిటీ: దీని గురించి రానా ఏం చెప్పాడంటే!

    |

    రెండేళ్లుగా కరోనా వైరస్ తెలుగు సినీ ఇండస్ట్రీపై ఏ రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు లాక్‌డౌన్ల కారణంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఎన్నో చిత్రాలు వాయిదా పడిపోయాయి. దీని వల్ల చిత్ర నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు ఎదురయ్యాయి. ఇక, వాయిదా పడిపోయిన సినిమాల్లో కొన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. కానీ, కొన్ని మాత్రం ఇంకా విడుదల కాకుండానే ఆగిపోయాయి. అలాంటి వాటిలో దగ్గుబాటి రానా నటిస్తోన్న 'విరాట పర్వం' ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే.

    షర్ట్ విప్పేసి ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్: పైనుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!షర్ట్ విప్పేసి ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్: పైనుంచి అందాలను చూపిస్తూ ఘాటుగా!

    దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను గత వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ, సెకెండ్ వేవ్ కారణంగా దీన్ని వేయాల్సి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ చివరి షెడ్యూల్‌ను ప్రారంభించి కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే పూర్తైన టాకీ పార్ట్‌కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి.. వాటిని కూడా వెంటనే దాదాపుగా పూర్తి చేసేశారు. ఇలా ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్ కాపీని చిత్ర యూనిట్ రెడీ చేసుకుందని ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

     Rana Daggubati Clarity on Virata Parvam Release

    సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన 'విరాట పర్వం' సినిమాను మొదటి లాక్‌డౌన్‌కు ముందే విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కానీ, అనివార్య కారణాలతో అది వీలు పడలేదు. ఈ నేపథ్యంలో దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన డీల్‌ను కూడా ఆ సంస్థతో క్లోజ్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో రానా సినిమా ఓటీటీలోనే విడుదల కాబోతుందని అంతా డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత సురేష్ బాబు వ్యాఖ్యలు కూడా దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి.

    ప్రియుడితో బెడ్‌పై శృతి హాసన్ రచ్చ: కరోనా ఉన్నా అలాంటి పనులు చేస్తూ!ప్రియుడితో బెడ్‌పై శృతి హాసన్ రచ్చ: కరోనా ఉన్నా అలాంటి పనులు చేస్తూ!

    'విరాట పర్వం' ఓటీటీలో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. 'భీమ్లా నాయక్' సక్సెస్‌తో యమ జోష్‌లో ఉన్న దగ్గుబాటి రానా.. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా అతడికి 'విరాట పర్వం' సినిమా రిలీజ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఈ యంగ్ హీరో స్పందిస్తూ 'ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులూ పూర్తయ్యాయి. రెండు మూడు రోజుల్లోనే ప్రివ్యూ చూడబోతున్నాం. అది అయిపోయిన వెంటనే రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తాం. మా వీలును బట్టి దీన్ని ఏ రోజు థియేటర్లలో విడుదల చేస్తామో ప్రకటిస్తాం' అంటూ వెల్లడించాడు.

    'విరాట పర్వం' చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, సురేష్ ప్రొడక్షనస్ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేలవింపుతో ఇది రూపొందుతోంది. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రలు చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు. ఇక, ఇందులో రానా కామ్రేడ్ రవన్న పాత్ర చేస్తుండగా.. సాయి పల్లవి మాత్రం పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది.

    English summary
    Rana Daggubati And Sai Pallavi Starrer ‘Virata Parvam’ Release Postponed Due to Covid Lockdown. Now Rana Daggubati Gave Clarity on This Movie Release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X